పరస్త్రీతో బీజేపీ కార్పొటరేర్ రాసలీలలు, ఫోటోలు వైరల్, ఎన్నికల సమయంలో భారీ దెబ్బ!
బెంగళూరు: కర్ణాటకలోని తుమకూరు మహానగర పాలికే కార్పొరేటర్ పరస్త్రీతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో తీసిన ప్రైవేట్ ఫోటోలు లీక్ కావడంతో సోషల్ మీడియాలో అవి వైరల్ అయ్యాయి. తుమకూరులోని 11వ వార్డు బీజేపీ కార్పొరేటర్ వెంకటేష్, మరో మహిళ తీసుకున్న ఫోటోలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బీజేపీ కార్పొరేటర్ వెంకటేష్ పరస్త్రీతో అర్డనగ్నంగా ఉన్న ఫోటోలు, లిప్ లాక్ ఫోటోలు, ఆమెను కౌగిలించుకున్న ఫోటోలతో పాటు అభ్యంతరకర ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలలో ఉన్న మహిళ ఎవరు అనే చర్చ ఇప్పుడు మొదలైయ్యింది.
తుమకూరు కార్పొరేటర్ రాసలీలలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ నాయకుడు ప్రైవేటు ఫోటోలు లీక్ కావడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తుమకూరులోని 11వ వార్డు ప్రజలు స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ మీద తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు ఎవరు ఎప్పుడు ఎక్కడ తీశారు అనే విషయం వెలుగు చూడలేదు.