మైండ్ బ్లాక్, సీఎం కొడుకు మీద కేసు, మోదీ, అమిత్ షాతో గేమ్స్ ఆడితే అంతే కథ, టైమ్ చూసి!
దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అదే సమయంలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో పలు పార్టీల నాయకులు వారికి అనుకూల వ్యతిరేక చర్చలు, ప్రసంగాలు వినిపిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్పై బీజేపీ, బీజేపీపై కాంగ్రెస్ పార్టీలు ఆరోపణల దాడి చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలపై బహిరంగంగా దూషించిన సీఎం కొడుకు మీద ఫిర్యాదు చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్య అనుచిత పదజాలంతో బీజేపీ నేతల మీద విరుచుకుపడుతున్నారు. దీంతో పాటు యతీంద్ర సిద్ధరామయ్యపై కూడా ఫిర్యాదు చేశారు. యతీంద్ర సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి అమిత్ షాను దూషించడం ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కమిషన్కు లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర శాఖ కర్ణాటకలోని వరుణ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే, సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యపై ఆరోపణలు చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం యతీంద్ర సిద్ధరామయ్య మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇది మా నాయకులపై వ్యక్తిగత దాడి అని, యతీంద్ర సిద్ధరామయ్య ప్రధాని మోదీ, అమిత్ షాలను నోటికి వచ్చినట్లు దూషించారని ఆరోపణలు చేశారని బీజేపీ ఆరోపించింది.
ఇది ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై వ్యక్తిగత దాడి అని బీజేపీ ఆ లేఖలో పేర్కొంది. ఇటీవల చామరాజనగర్ జిల్లా హనూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రసంగించిన యతీంద్ర సిద్ధరామయ్య, హోం మంత్రి అమిత్ షా ఒక గూండా, రౌడీ అని, గుజరాత్లో నరమేధానికి ఆయన పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి అమిత్ షాను ముందు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలు చేశారన్నారని యతీంద్ర ఆరోపించారు.
సీఎం సిద్దరామయ్య కొడుకు యతీంద్ర విమర్శలను కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సహా పలువురు బీజేపీ నాయకులు ఖండించారు. ఇలాంటి ఆరోపణలు చేసిన యతీంద్రపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. మా పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గురించి యతీంద్ర సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని, ఇది అత్యంత నీచమైన రాజకీయం అని బీజేపీ ఆరోపించింది.
మాజీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్న యతీంద్ర కనీసం పరువు కూడా మర్చిపోయినట్లున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మైసూర్తోపాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటమి ఖచ్చితంగా ఉంటుందని, ఓడిపోతామనే భయం, నిరాశతో సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర అవమానకరమైన పదాలను ఉపయోగించి దేశ హోంమంత్రి అమిత్ షా పై చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు ఆరోపించారు.
-
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications