ఉల్లాసంగా..ఉత్సాహంగా! బీజేపీ సభ్యుల మార్నింగ్ వాక్!
Recommended Video
బెంగళూరు: బలపరీక్ష నిర్వహించకుండానే శాసనసభను అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలోనే రాత్రంతా నిద్రపోయిన కర్ణాటక భారతీయ జనతాపార్టీ సభ్యులు.. శుక్రవారం ఉదయం ఉల్లాసంగా కనిపించారు. తెల్లవారు జామునే నిద్రలేచిన పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో మార్నింగ్ వాక్ చేశారు. శాసనసభకు ఎదురుగా ఉన్న కబ్బన్ పార్క్ వరకూ మార్నింగ్ వాక్ చేశారు. కబ్బన్ పార్క్లో తేలికపాటి వ్యాయామం చేశారు. నిజానికి- ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం నాడే శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండగా.. అది శుక్రవారానికి వాయిదా పడింది.
అసెంబ్లీలోనే భోజనం..అక్కడే నిద్ర! దిండు, దుప్పటి తీసుకెళ్లి కునుకు తీసిన సభ్యులు
మధ్యాహ్నానికంతా తేలనున్న భవితవ్యం..
తమ సభ్యుడు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ కిడ్నాప్కు గురయ్యారని, ఈ ఘటన వెనుక బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. దీనితో సభను మరుసటిరోజుకు వాయిదా వేశారు. దీన్ని నిరసిస్తూ బీజేపీ సభ్యులు గురువారం రాత్రంతా సభలోనే నిద్రించారు. ఈ తెల్లవారు జామునే ఎమ్మెల్యేలు మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించారు. కుమారస్వామి ప్రభుత్వానికి శుక్రవారం అత్యంత కీలకంగా మారింది. మధ్యాహ్నం 1:30 నాటికి బలాన్ని నిరూపించుకోవాలంటూ గవర్నర్ వజూభాయ్ వాలా అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో- ఈ గండం నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి ఎలాంటి వ్యూహాలను రచిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
#WATCH Bengaluru: K'taka BJP legislators go for a morning walk. They were on an over night 'dharna' at Vidhana Soudha over their demand of floor test. Karnataka Guv Vajubhai Vala has written to the CM,asking him to prove majority of the govt on floor of the House by 1:30 pm today pic.twitter.com/r8yygSyf4X
— ANI (@ANI) July 19, 2019
ఈ ఒక్కరోజే ఛాన్స్..!
మార్నింగ్ వాక్ చేస్తోన్న ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కుమారస్వామి ప్రభుత్వానికి ఆయువు మూడిందని వ్యాఖ్యానించారు. శుక్రవారం మధ్యాహ్నానికి ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. గురువారమే ఈ పని పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ- శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ ఉదంతాన్ని అడ్డుగా పెట్టుకుందని ఆరోపించారు. అయినప్పటికీ- ఇది కేవలం తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపించడానికి అవసరమైన మద్దతు కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి లేదని తేల్చి చెప్పారు. నిజంగా తగినంత సంఖ్యాబలం ఉండి ఉంటే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఇన్ని నాటకాలు ఆడేది కాదని విమర్శించారు.