పరిచయమైన 24 గంటల్లో యువతి వలలో ఎమ్మెల్యే, ఆ పనైపోయింది, సెక్స్ వీడియోలతో ఫినిష్ !
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే హనీట్రాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. యువతి పరిచయం అయిన 24 గంటల్లో ఆ ఎమ్మెల్యే వలలో పడిపోయాడని, ఆ పని కోసం రాసలీలలు సాగిస్తూ రహస్య కెమెరాలకు చిక్కిపోయాడని వెలుగు చూడటంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలు షాక్ కు గురైనారు. యువతి పరిచయం అయిన 24 గంటల్లోనే ఆమె తనను వలలో వేసుకుందని స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటకలో జరిగిన హనీట్రాప్ లో ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది ప్రముఖులు, శ్రీమంతులు పడ్డారని సీసీబీ పోలీసులు అంటున్నారు.
హనీట్రాప్ లో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, రూ. 50 కోట్లకు డీల్, బ్లాక్ మెయిల్,వైరల్ వీడియోలు !
ఎమ్మెల్యే క్వాటర్స్
హనీట్రాప్ కేసులో అరెస్టు అయిన ప్రముఖ నిందితుడు రాఘవేంద్ర అలియాస్ రఘు, రాజేష్ మరో ఇద్దరు యువతులు అక్టోబర్ 12వ తేదీ బెంగళూరు నగరంలోని శాసన సభ్యుల భవనం (ఎమ్మెల్యే క్వాటర్స్) దగ్గరకు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేని పరిచయం చేసుకున్నారు. తాము ఆర్గానిక్ సైంటిస్టులు అంటూ ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్నారు. తరువాత బీజేపీ ఎమ్మెల్యేను మాయమాటల్లో దింపారు.
వల వేసిన వయ్యారి లేడీ
ఎమ్మెల్యేతో పరిచం చేసుకున్న యువతి అక్కడే అతనికి కొంటెగా సైగలు చేసింది. తాము రినైసెన్స్ హోటల్ లో రూంలో ఉన్నామని, మీరు ఓ సారి అక్కడికి రావాలని ఆ యువతి ఎమ్మెల్యేకి చెప్పి ఆయన మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకుంది. అదే రోజు రాత్రి ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన యువతి తాను ఒంటరిగా ఉన్నానని, రావాలని చెప్పింది. మరుసటి రోజు (అక్టోబర్ 13వ తేదీ) మద్యాహ్నం 4 గంటలకు మీ గదికి వస్తానని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చాడు.
వచ్చిన వెంటనే రాసలీలలు
హోటల్ లోని యువతి ఉన్న గదిలోకి ఎమ్మెల్యే వెళ్లాడు. అంతే అక్కడ అర్దనగ్నంగా ఉన్న యువతి ఎమ్మెల్యేను రెచ్చగొట్టి ముగ్గులోకి దింపింది. నేను మీ మీద చాల రోజుల నుంచి మనుసుపారేసుకున్నానని, తన కోరిక తీర్చాలని రెచ్చగొట్టిన యువతి నగ్నంగా తయారై ఎమ్మెల్యేని రంగంలోకి దింపింది. అంతే ఎమ్మెల్యే, యువతి రాసలీలు సాగిస్తున్న సమయంలో అదే గదిలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
టీవీ చానల్స్ లో ప్రసారం
తరువాత రాఘవేంద్ర, యువతి బ్లాక్ మెయిల్ చేసి ఫోటోలు, వీడియోలు అడ్డం పెట్టుకుని రూ. కోట్లు డిమాండ్ చేశారని, హోటల్ లో రూంలోకి వెళ్లిన వెంటవెంటనే ఇలా జరిగిపోవడంతో తన శరీరం అదుపుతప్పి యువతితో రాసలీలలు సాగించానని ఎమ్మెల్యే పోలీసుల ముందువాపోయాడు. వీడియోలు టీవీ చానల్స్ కు విడుదల చేస్తామని యువతి, రాఘవేంద్ర తదితరులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక మీకు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్చే అంటున్నారని సీసీబీ పోలీసులు తెలిపారు.
సెక్స్ వీడియోలతో పంగనామాలు
హనీట్రాప్ వలలో ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది శ్రీమంతులు పడ్డారని, వీరి వెనుక చాల పెద్ద నెట్ వర్క్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మొదట రాసలీలల వీడియోలు అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేసి రూ. 50 కోట్లు లాక్కోవాలని ప్రయత్నించారు. చివరికి రూ. 10 కోట్లకు డీల్ కుదిరింది. మొదటి విడతలో ఎమ్మెల్యే నుంచి రూ. 1 కోటి వసూలు చేశారు. తరువాత అంత డబ్బులు ఇవ్వలేని ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించాడు. ఎమ్మెల్యే ను ఇప్పటికే రెండు సార్లు విచారణ చేసి వివరాలు రికార్డు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ తయారు చేశారు.
పరువు మర్యాద పోయింది
టీవీ చానల్స్ లో రాసలీలల వీడియోలు ప్రసారం అయితే పరువు మర్యాద పోతుందని ఆందోళనతో ఆ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేసిన వారు ఎలా చెబితే అలా చేశారు. అయితే భారీ మొత్తంలో నగదు డిమాండ్ చెయ్యడంతో నవంబర్ 18వ తేదీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని ఎమ్మెల్యే నిర్ణయించాడు. అయితే మళ్లీ ఆలోచించి నవంబర్ 25వ తేదీ ఫిర్యాదు చేశారని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే రాఘవేంద్ర, అతని అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు రాసలీలలు వీడియోలు రికార్డు చేసిన పెన్ డ్రైవర్, హార్డ్ డిస్క్, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సీజ్ చేసి వాటిని పరిశీలిస్తున్నారు. మొత్తం మీద పరిచయం అయిన 24 గంటల్లో యువతి వలలో ఎమ్మెల్యే పడిపోయారని వెలుగు చూడటంతో పోలీసులు సైతం షాక్ కు గురైనారు.