Coronavirus: అయోధ్య ప్రోగ్రామ్ గోవింద, ఆసుపత్రిలో సంతకాలు చేస్తున్న సీఎం, పాపం టైమ్ బ్యాడ్ !
బెంగళూరు/ అయోధ్య: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా తారుమారు అవుతాయో చెప్పడం నరమానవుడికి సాధ్యం కావడం లేదు. అలా చెప్పడం ఆ దేవుడికే సాధ్యం అవుతోంది. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఈ రోజు హ్యాపీగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి అయోధ్యలోని రామ జన్మభూమిలో రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనవలసిన ఓ సీఎం నేడు ఆసుపత్రిలో కుర్చుకుని రామరామా అంటూ ఫైల్స్ మీద సంతకాలు చేుకుంటున్నారు.
Coronavirus: సీఎంకు కరోనా, నేడు కూతురికి పాజిటివ్, కొడుకు క్వారంటైన్, బల్లాల్ క్లారిటీ !
వెంటాడిన వైరస్
కర్ణాటకలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి కట్టడి కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడ్డారు. ప్రతిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ కరోనా వైరస్ కట్టడికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇలాంటి సమయంలోనే సీఎం బీఎస్. యడియూరప్పను కరోనా వైరస్ వెంటాడింది.
సీఎంతో పాటు కూతురికి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కుమార్తె బీఎస్. అరుణా దేవికి కరోనా పాజిటివ్ రావడంతో బెంగళూరులోని పాత ఎయిర్ పోర్టు రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఆసుపత్రిపాలైనారు.
టైమ్ బాగుంటే ఈ టైమ్ లో అయోధ్య !
అదిక శాతం మంది హిందువుల చిరుకాల స్వప్నం రామమందిరం నిర్మాణం పనులకు బుధవారం (నేడు) భూమి పూజ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు. దేశంలోని అనేక మంది ప్రముఖులు రామమందిరం భూమి పూజా కార్యక్రమానికి హాజరైనారు. కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ముందుగా ఊహించినట్లు అన్ని జరిగి టైమ్ బాగా ఉండుంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి అయోధ్యలో రామమందిరం నిర్మాణం భూమిపూజా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండేది. అయితే కరోనా వైరస్ వెంటాడటంతో సీఎం బీఎస్. యడియూరప్ప ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.
Recommended Video
ఆసుపత్రిలో రామరామా అంటూ సంతకాలు
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో కరోనా వైరస్ వ్యాధి నయం కావడానికి చికిత్స పొందుతున్నారు. సీఎం బీఎస్. యడియూరప్ప ప్రభుత్వ శాఖలకు చెందిన అతి ముఖ్యమైన ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్న ఫోటోను సీఎం కార్యాలయం సిబ్బంది విడుదల చేశారు. బుధవారం అయోధ్యలో జై శ్రీరామ్ అనాల్సిన సీఎం బీఎస్. యడియూరప్ప ఆసుపత్రిలోనే రామరామా అంటూ ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.