వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఎన్నికలు: సీఎం సిద్దరామయ్య, బళ్లారి ఎంపీ శ్రీరాములకు అదృష్టం లేదు, అదే సమస్య!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సీఎం సిద్దరామయ్య, బళ్లారి ఎంపీ శ్రీరాములకు అదృష్టం లేకుండాపోయింది. కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ శనివారం జోరుగా కొనసాగుతోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాస్ నాయకుడు శ్రీరాములును స్టార్ లీడర్ చేసిన బీజేపీ దళితులు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఓట్లు రాబట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేసింది. అయితే సీఎం సిద్దరామయ్య, బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు వారి కోసం వారు ఓటు వేసుకోలేని పరస్థితి ఎదురౌయ్యింది.

Recommended Video

Karnataka Elections 2018 : Polling In Rajarajeshwari Nagar Postponed
సీఎం సిద్దరామయ్య పోటీ

సీఎం సిద్దరామయ్య పోటీ

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంలో, బాగల్ కోటే జిల్లాలోని బాదామి శాసన సభ నియోజక వర్గంలో పోటీ చేస్తున్నారు. చాముండేశ్వరి, బాదిమి శాసన సభ నియోజక వర్గాల్లో శనివారం ఊహించిన దానికంటే జోరుగా పోలింగ్ జరుగుతోంది.

బళ్లారి ఎంపీ శ్రీరాములు

బళ్లారి ఎంపీ శ్రీరాములు

బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో, బాగల్ కోటే జిల్లాలోని బాదామి శాసన సభ నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య మీద పోటీ చేస్తున్నారు. మాళకాల్మూరు, బాదామి శాసన సభ నియోజక వర్గాల్లో జోరుగా పోలింగ్ జరుగుతోంది.

సీఎం, శ్రీరాములకు అదృష్టం లేదు

సీఎం, శ్రీరాములకు అదృష్టం లేదు

సీఎం సిద్దరామయ్య ఆయన పోటీ చేస్తన్న చాముండేశ్వరి, బాదామి శాసన సభ నియోజక వర్గాల్లో ఓటు వేసుకువడానికి అవకాశం లేకుండా పోయింది. బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు ఆయన పోటీ చేస్తున్న మాళకాల్మూరు, బాదామి శాసన సభ నియోజక వర్గాల్లో ఓటు వేసుకునే అవకాశం లేదు.

కుమారుడి కోసం సిద్దూ

కుమారుడి కోసం సిద్దూ

మైసూరు జిల్లాలోని వరుణ శాసన సభ నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు డాక్టర్ యతీంధ్ర పోటీ చేస్తున్నారు. సీఎం సిద్దరామయ్యకు వరుణ శాసన సభ నియోజక వర్గంలో ఓటు హక్కు ఉంది. సీఎం సిద్దరామయ్య వరుణ శాసన సభ నియోజక వర్గంలోని హుండి పోలింగ్ బూత్ లో కుమారుడు డాక్టర్ యతీంద్రకు ఓటు వేశారు.

శ్రీరాములు ఫ్యామిలీ

శ్రీరాములు ఫ్యామిలీ

బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములకు మాళకాల్మూరు, బాదామిలో ఓటు హక్కు లేదు. శ్రీరాములకు బళ్లారిలో ఓటు హక్కు ఉంది. శనివారం శ్రీరాములు ఆయన నివాసంలో గోవుపూజ చేసిన అనంతరం భార్య, కుటుంబ సభ్యులతో కలిసి బళ్లారిలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆవరణంలోని పోలింగ్ బూత్ లో బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేశారు. అనంతరం శ్రీరాములు మాళకాల్మూరు, బాదామి నియోజక వర్గాల్లో పోలింగ్ ఎలా జరుగుతుందో అని పరిశీలించడానికి వెళ్లారు.

ఒక్క ఓటుతో ఓటమి

ఒక్క ఓటుతో ఓటమి

దేశంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన నాయకులను మనం చాలమందిని చూశాం. దేశం మొత్తం ఇప్పుడు కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా అందరూ బాదామిలో సీఎం సిద్దరామయ్య గెలుస్తారా, శ్రీరాములు గెలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇద్దరూ నాయకులు వారి కోసం వారు ఓటు వేసుకునే పరస్థితి లేకండాపోయింది. ఒక్క ఓటు తేడా వచ్చినా పరిస్థితులు తారుమారు అవుతాయి.

English summary
Karnataka CM Siddaramaiah and BJP's Sriramulu will not cast their votes in both the constituencies they are contesting from. CM Siddaramaiah is contesting from Chamundeshwai and Badami constituencies. Also, BJP's Sriramulu is contesting from Molakalmuru and Badami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X