రాజకీయ బాహుబలి మోదీయేనా!.. కర్ణాటక గెలుపుకు కారణాలు ఇవేనా?
Recommended Video
దేశవ్యాప్తంగా ఎన్ని ప్రతికూలతలున్నా ప్రధాని నరేంద్రమోదీ ప్రతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను చావుదెబ్బ తీస్తున్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు అంశాలను ప్రజలు పట్టించుకోవడం లేదనే విషయం మరోసారి కర్ణాటక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. మోదీ నాయకత్వంలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ విజయదుంధుబి మోగిస్తున్నది. ప్రస్తుతం ప్రధాని మోదీని బాహుబలిగా కీర్తిస్తున్నారు. మోదీ జైత్రయాత్రకు కారణాలు ఇవే..
అమిత్ షా చతురత
బీజేపీ చీఫ్ అమిత్షా రాజకీయ చతురత, ఎన్నికల ప్రణాళిక కాషాయ పార్టీకి కలిసివస్తున్నది. అమిత్షా పోల్ మేనేజ్మెంట్ యంత్రాంగం బాగా పనిచేసింది. కుల ప్రతిపాదికగా బీజేపీ అమలు చేసిన వ్యూహం కర్ణాటక ఎన్నికల్లో కలిసివచ్చింది.
తెలుగు ప్రజలు బీజేపీ వైపే
కర్ణాటకలో తెలుగు ప్రజలు ప్రభావిత సంఖ్యలో ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల చేసిన ప్రచారాన్ని తెలుగు పట్టించుకోలేదనేది స్పష్టంగా కనిపించింది. మోదీపైనే అన్ని వర్గాల ప్రజలు నమ్మకం ఉంచినట్టు కనిపించింది.
కీలకంగా మోదీ ఆకర్షణ
కార్యకర్తలను, బీజేపీ శ్రేణులను ఉత్సాహ పరచడంలో మోదీ, అమిత్ షా ద్వయం సక్సెస్ అయింది. పార్టీ నేతలు కష్టపడిన తీరు, వ్యూహాలు, మోదీ ఆకర్షణ బీజేపీని విజయపథాన నడిపించింది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
21 ప్రాంతాల్లో మోదీ ప్రచారం
కర్ణాటకలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 21 ప్రాంతాల్లో మోదీ నిర్వహించిన ప్రచారం బీజేపీలో ఉత్తేజాన్ని నింపింది. మోదీ ప్రచారం కాంగ్రెస్ను ఇబ్బందిలోకి నెట్టింది.
కాంగ్రెస్పై వ్యతిరేకత
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను మోదీ, అమిత్ షా ద్వయం చక్కగా ఉపయోగించుకొన్నది. కాంగ్రెస్లోని కుమ్ములాట దృష్టిలో పెట్టుకొని కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టింది. దాంతో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకొన్నది.
కేసీఆర్ ప్రచారం
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని, జేడీఎస్కు మద్దతు తెలిపిన కేసీఆర్ వ్యూహం బాగానే పనిచేసింది. జేడీఎస్ భారీగా సీట్లు పెరగడంతో కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. జేడీఎస్ పుంజుకోవడం బీజేపీకి కలిసి వచ్చింది.
కాంగ్రెస్కు లింగాయతు దెబ్బ
లింగాయతులకు మైనారిటీ హోదా ఇచ్చినప్పటికీ కాంగ్రెస్కు కలిసిరాలేదు. బీజేపీ పక్షానే లింగాయతులు నిలిచారు. కుల ప్రాతిపదికన గెలుపు చేజిక్కించుకొందామనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్లాన్ ఘోరంగా దెబ్బతిన్నది.
ఎస్సీ, ఎస్టీలు అండ
కర్ణాటకలో షెడ్యూలు కులాలు, తెగలు బీజేపీకి అండగా నిలిచారు. ఎస్పీ క్యాటగిరీకి చెందిన శ్రీరాములు అంశం బీజేపీకి అనుకూలించింది. బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్రెడ్డికి శ్రీరాములు సన్నిహితం కావడం కూడా బీజేపీకి లాభించింది.