కర్నాటక ఎన్నికలు-తాజా సర్వే: బీజేపీకి ఎక్కడ దెబ్బ, కాంగ్రెస్కు ఎక్కడ ప్లస్?
బెంగళూరు: కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, దక్షిణాదిన పాగా వెయ్యాలనుకునే బీజేపీకి చుక్కెదురు ఖాయమని సీ ఫోర్ సర్వే వెల్లడించింది. ఇటీవల చేసిన అన్ని సర్వేలు దాదాపు హంగ్ ఏర్పడుతుందని, కాంగ్రెస్, బీజేపీలకు మెజార్టీకి కావాల్సిన సీట్లు రావని చెప్పాయి.
కర్నాటక ఎన్నికలు: సీ ఫోర్ సర్వే.. బీజేపీకి షాక్, 128 సీట్లతో కాంగ్రెస్దే గెలుపు
అయితే, తాజాగా వచ్చిన సీ ఫోర్ సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని తెలిపింది. 224 అసెంబ్లీ స్థానాలకు అధికారానికి కావాల్సిన స్థానాలు 113. కాంగ్రెస్ పార్టీకి 118 నుంచి 128 సీట్లు వస్తాయని సీ ఫోర్ సర్వే వెల్లడించింది. మే 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మే 15న ఫలితాలు వెల్లడవుతాయి.
చదవండి: కర్నాటక ఎన్నికలు: గాలి జనార్ధన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం షాక్!
61 నియోజకవర్గాల్లో సర్వే
బీజేపీకి 63 నుంచి 73, జేడీఎస్కు 29 నుంచి 36 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఈ సర్వేను ఏప్రిల్ 20వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య నిర్వహించారు. సర్వే కోసం సిస్టమెటిక్ రాండమ్ శాంప్లింగ్ మెథడాలజీని ఉపయోగించారు. 61 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 6247 శాంపిల్స్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి 45 శాతం ఓట్లు, బీజేపీకి 32 శాతం, జేడీఎస్కు 18 శాతం ఓట్లు పడతాయని సర్వేలో తేలింది.
పురుషులు, మహిళలు ఇలా
జెండర్ వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 43 శాతం పురుషులు, 47 శాతం మంది పురుషులు ఓటేస్తామని చెప్పారు. బీజేపీకి 34 శాతం మంది పురుషులు, 30 శాతం మంది మహిళలు, జేడీఎస్కు 19 శాతం మంది పురుషులు, 16 శాతం మంది మహిళలు ఓటేస్తామన్నారు.
ఏ వయస్సు వారు ఏ పార్టీకి ఓటేస్తామన్నారంటే?
18-25 ఏళ్ల మధ్య ఉన్న వారు 45 శాతం మంది, 26-35 ఏళ్ల మధ్య వారు 47 శాతం మంది, 36-50 ఏళ్ల మధ్య 42 శాతం మంది 50 ఏళ్లకు పైబడిన వారు 49 శాతం మంది కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్పారు. 18-25 ఏళ్ల మధ్య ఉన్న వారు 36 శాతం మంది, 26-35 ఏళ్ల మధ్య వారు 32 శాతం మంది, 36-50 ఏళ్ల మధ్య 33 శాతం మంది 50 ఏళ్లకు పైబడిన వారు 26 శాతం మంది బీజేపీకి ఓటేస్తామన్నారు. 18-25 ఏళ్ల మధ్య ఉన్న వారు 15 శాతం మంది, 26-35 ఏళ్ల మధ్య వారు 17 శాతం మంది, 36-50 ఏళ్ల మధ్య 19 శాతం మంది 50 ఏళ్లకు పైబడిన వారు 20 శాతం మంది జేడీఎస్కు ఓటేస్తామని చెప్పారు.
సర్వే ప్రకారం బెంగళూరులో
ప్రాంతాల వారీగా చూస్తే బెంగళూరులో 28 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 17-19 సీట్లు, 48 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. బీజేపీకి 8-10 స్థానాలు, 31 శాతం ఓట్లు, జేడీఎస్కు 1-2 స్థానాలు 14 శాతం ఓట్లు.
సర్వే ప్రకారం పాత మైసూరులో
సర్వే ప్రకారం పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి 31-33 సీట్లు, 43 శాతం ఓట్లు, బీజేపీకి 5-6 సీట్లు 17 సాతం ఓట్లు, జేడీఎస్కు 25-27 సీట్లు 34 శాతం ఓట్లు రానున్నాయి. పాత మైసూరు ప్రాంతంలో 65 సీట్లు ఉన్నాయి.
సర్వే ప్రకారం బాంబే కర్నాటక
సర్వే ప్రకారం బాంబే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి 27-29 సీట్లు, 46 శాతం ఓట్లు, బీజేపీకి 19-21 సీట్లు 41 శాతం ఓట్లు, జేడీఎస్కు 1-2 సీట్లు 5 శాతం ఓట్లు రానున్నాయి. బాంబే కర్నాటకలో 50 సీట్లు ఉన్నాయి.
సర్వే ప్రకారం సెంట్రల్ కర్నాటక
సర్వే ప్రకారం సెంట్రల్ కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి 7-8 సీట్లు, 40 శాతం ఓట్లు, బీజేపీకి 13-14 సీట్లు, 45 శాతం ఓట్లు, జేడీఎస్కు 1-2 సీట్లు, 7 శాతం ఓఠ్లు వస్తాయి. సెంట్రల్ కర్నాటకలో 22 సీట్లు ఉన్నాయి.
సర్వే ప్రకారం కోస్టల్ రీజియన్
సర్వే ప్రకారం కోస్టల్ రీజియన్లో 19 స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 10-11 స్థానాలు 47 శాతం ఓట్లు, బీజేపీకి 8-9 స్థానాలు 43 శాతం ఓట్లు, జేడీఎస్కు 0-1 స్థానాలు 6 శాతం ఓట్లు వస్తాయి.
సర్వే ప్రకారం హైదరాబాద్ కర్నాటక
హైదరాబాద్ కర్నాటకలో 40 స్థానాలు ఉన్నాయి. సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 26-28 సీట్లు 44 శాతం ఓట్లు, బీజేపీకి 10-12 సీట్లు 35 శాతం ఓట్లు, జేడీఎస్కతు 1-2 సీట్లు, 14 శాతం ఓట్లు రానున్నాయి.