కర్నాటక ఎన్నికలు-దిగ్విజయ ఎగ్జిట్ పోల్: మెజార్టీకి దగ్గర్లో బీజేపీ, కాంగ్రెస్కు 80 స్థానాలే
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ సర్వేల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సర్వేలు హంగ్ వస్తాయని చెబితే, కొన్ని కాంగ్రెస్, మరికొన్ని బీజేపీ గెలుపుకు దగ్గరగా ఉంటాయని చెబుతున్నాయి.
దిగ్విజయ టీవీ ఛానల్ సర్వే ప్రకారం బీజేపీకి 103-107, కాంగ్రెస్ పార్టీకి 76-80, జేడీఎస్కు 31-35, ఇతరులకు 4-8 సీట్లు వస్తాయి. స్వతంత్రులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందని ఈ ఫలితంలో వెల్లడైంది.
సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీకి 103, కాంగ్రెస్కు 93, జేడీఎస్కు 25, ఇతరులకు 1 సీటు వస్తాయని వెల్లడించింది.
కాగా, 2019 సార్వత్రిక ఎన్నికలకు, మరో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన కర్నాటక శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
బీజేపీ ఓడిపోతే 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీకి గట్టి దెబ్బ. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాహుల్ గాంధీ నాయకత్వంపై మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇరు పార్టీలు ఈ ఎన్నికలను కీలకంగా తీసుకున్నాయి. హంగ్ ఏర్పడుతుందా లేక ఏ పార్టీకైనా ప్రజలు ఏకపక్షంగా పట్టం కడతారా అనే దానిని ఎగ్జిట్ పోల్ అంచనాల ఆధారంగా దాదాపు లెక్క వేసుకోవచ్చు.
దిగ్విజయ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం..
కాంగ్రెస్
పార్టీ
-
76-80
భారతీయ
జనతా
పార్టీ
-103-107
జేడీఎస్
-
31-35
ఇతరులు
-
4-8
సీ ఓటరు సర్వే ప్రకారం..
కాంగ్రెస్
పార్టీ
-
93
భారతీయ
జనతా
పార్టీ
-103
జేడీఎస్
-
25
ఇతరులు
-1