న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీకి ఎక్కవ సీట్లు, పడిపోయిన కాంగ్రెస్, పెరగని జేడీఎస్
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని ఎక్కువ సర్వేలు వెల్లడిస్తుండటం గమనార్హం. కొన్ని సంస్థలు బీజేపీ, కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నప్పటికీ.. ఈ రెండు పార్టీలకు జేడీఎస్ మద్దతే కీలకం కానుందని దాదాపు అన్ని సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
న్యూస్ నేషన్ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
బీజేపీ:
105-109
కాంగ్రెస్:
71-75
జేడీఎస్:
36-40
ఇతరులు:
2-3
స్థానాలు
లభించే
అవకాశాలున్నాయని
పేర్కొంది.
2019 లోకసభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. జేడీఎస్ కూడా తనవంతుగా ప్రచారాన్ని విస్తృతంగానే నిర్వహించింది. అసలైన ఫలితాల కోసం మాత్రం మే 15 వరకు వేచిచూడాల్సిందే.