గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరు, ఆ స్కాం మాకు తెలీదు, మాజీ సీఎం: హైకమాండ్!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి నేడు ఒంటరి అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభవించి షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి నేడు బీజేపీ నాయకులు ఎలాంటి సహకారం అందించడానికి ముందుకు రావడం లేదు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరని, ఆ స్కాం గురించి మాకు తెలీదని మాజీ సీఎం చెప్పడంతో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పరార్ ? పోలీసుల వేట, 57 కేజీల బంగారం, ఈడీకి లంచం!
అజ్ఞాతంలో మాజీ మంత్రి
ఆంబిడెంట్ కంపెనీ డీల్ కు సంబంధించిన కేసులో గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఈ విషయంపై బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప స్పంధించారు. గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని యడ్యూరప్ప తేల్చి చెప్పారు.
మాతో మాట్లాడలేదు
తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే అని యడ్యూరప్ప అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు తప్పా మిగిలిన విషయాలు తనకు తెలీదని, మాతో ఎవరూ ఈ విషయంపై మాట్లాడలేదని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప అన్నారు.
ఎక్కువ మాట్లాడం
గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరని, అందువలన ఈ విషయంపై పూర్తి వివరాలు తాము సేకరించలేదని బీఎస్. యడ్యూరప్ప అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఆండిడెంట్ డీల్ కేసు విషయంలో ఎక్కవ మాట్లాడటానికి మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప నిరాకరించారు.
బీజేపీ హైకమాండ్
గాలి జనార్దన్ రెడ్డి విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని బీఎస్. యడ్యూరప్ప మీడియాకు చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి కర్ణాటక బీజేపీ నాయకులు ఎలా స్పంధించాలి అనే విషయం హైకమాండ్ చూసుకుంటుందని బీఎస్. యడ్యూరప్ప తేల్చి చెప్పారు.
గతంలో గాలి కింగ్
గతంలో బీజేపీలో చక్రం తప్పిన గాలి జనార్దన్ రెడ్డికి ఆ పార్టీ నాయకులు నేడు మద్దతు ఇవ్వకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో చట్టం తనపని తాను చేసుకు పోతుందని ఆయన ప్రాణ స్నేహితుడు, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు బుధవారం చెప్పిన విషయం తెలిసిందే.