వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానికి బీహార్ మీద ప్రేమ, కర్ణాటక మీద కక్ష, ఏం జరిగిందో, మాజీ సీఎం సెటైర్లు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీహార్ మీద ఉన్నటువంటి ప్రేమా, అభిమానాలు కర్ణాటక మీద ప్రధాని నరేంద్ర మోడీకి ఎందుకు లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. బీహార్ వరద విషయంలో వెంటనే స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక వరదల విషయంలో రెండు నెలలు అయినా స్పందించలేదని, సీఎం యడియూరప్ప మీద ప్రధాని నరేంద్ర మోడీకి ఏమైనా కక్ష ఉందా ? అని మాజీ సీఎం సిద్దరామయ్య అనుమానం వ్యక్తం చేశారు.

హైకోర్టులో డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ, తీహార్ జైలే, తమ్ముడికి సమన్లు, పాపం!హైకోర్టులో డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ, తీహార్ జైలే, తమ్ముడికి సమన్లు, పాపం!

విశాల హృదయం కాదు బండరాయి

విశాల హృదయం కాదు బండరాయి

బీహార్ వరద ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ 52 ఇంచుల విశాల హృదయం చూపించారని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. అదే కర్ణాటక వరద ప్రాంతాల ప్రజలను ఆదుకునే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ గుండె బండరాయి అయ్యిందని మాజీ సీఎం సిద్దరామయ్య సోషల్ మీడియాలో ఎద్దదేవ చేశారు.

25 మంది ఎంపీలను ఇస్తే !

25 మంది ఎంపీలను ఇస్తే !

కర్ణాటక 25 మంది బీజేపీ ఎంపీలను ఇచ్చిందని మాజీ సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ కర్ణాటక ఎంతో చేసిందని, కన్నడిగులు ఓట్లు వేస్తేనే 25 మంది ఎంపీలు వచ్చారు అనే విషయం ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు పెట్టుకోవాలని మాజీ సీఎం సిద్దరామయ్య సూచించారు.

సీఎం మీద ప్రధానికి కక్షా ?

సీఎం మీద ప్రధానికి కక్షా ?

బీహార్, కర్ణాటక వరదల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తారతమ్యం చూపిస్తున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు ఈ విషయంలో ఆలోచిస్తే సీఎం యడియూరప్ప మీద ప్రధాని నరేంద్ర మోడీకి ఏమైనా ద్వేషం ఉందా? అనే అనుమానం వస్తోందని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

బీహార్ సీఎంతో మాట్లాడాను

బీహార్ సీఎంతో మాట్లాడాను

బీహార్ లో వచ్చిన వరదల విషయంలో తాను ఎంతో భాదపడుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని మాజీ సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో తాను మాట్లాడానని, ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చెయ్యడానికైనా సిద్దంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా చెప్పారని మాజీ సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు.

 ఖాళీ చేతులతో పంపిచారు

ఖాళీ చేతులతో పంపిచారు

కర్ణాటక వరద ప్రాంతాలను ఆదుకోవాలని, ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవడానికి వెంటనే సహాయం చెయ్యాలని సీఎం యడియూరప్ప కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు మనవి చేశారని, రెండుసార్లు ప్రత్యేక బృందాలు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసినా ఫలితం లేదని, అన్నిసార్లు ఖాళీ చేతులతో బెంగళూరు పంపించారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. కన్నడిగుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తారతమ్యం చూపిస్తున్నారని, బీహార్ విషయంలో చూపించిన శ్రద్దలో కేవలం 20 శాతం కర్ణాటక మీద చూపించలేదని మాజీ సీఎం సిద్దరామయ్య సోషల్ మీడియాలో మండిపడ్డారు.

English summary
Karnataka former CM Siddaramaiah blames narendra Modi for not helping for Karnataka flood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X