Coronavirus: మాజీ ప్రధాని కొడుకు, మాజీ సీఎం అన్న, మాజీ మంత్రి, కరోనా పాజిటివ్: హరోహర !
బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు ఎవ్వరూ అతీతం కాదని మరోసారి వెలుగు చూసింది. మాజీ ప్రధాని కొడుకు, మాజీ సీఎం అన్న, మాజీ మంత్రి అయిన సీనియర్ ఎమ్మెల్యేను కరోనా వైరస్ వెంటాడింది. మా పార్టీ డైనమిక్ ఎమ్మెల్యేకు కరోపా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆ పార్టీలోని సాటి ఎమ్మెల్యేలు, ఆయన భద్రతా సిబ్బంది ఎక్కడ మాకు కరోనా వైరస్ సోకుతుందో అనే భయంతో హడలిపోతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మాజీ సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బాధితుల జాబితాలో చేరిపోయారు. మాజీ మంత్రి అనుచరులు ఇప్పుడు నువ్వు కాపాడు దేవుడా అంటూ హరోహర అంటూ పూజలు చేస్తున్నారు.
Play school teacher: భర్తకు బిస్కెట్, ప్రియుడికి బత్తాయి కాయలు, లాక్ డౌన్ లో లవ్ స్టోరీ !
మాజీ ప్రధాని కొడుకు, మాజీ సీఎం అన్న
భారత మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్న, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ డేర్ అండ్ డైనమిక్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటక రాజకీయాల్లో, జేడీఎస్ పార్టీలో హెచ్.డి. రేవణ్ణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దైవభక్తి ఎక్కువగా ఉన్న హెచ్.డి. రేవణ్ణ ఎప్పుడు పూజలు, పుణ్యక్షేత్రాలు అంటూ చేతిలో నిమ్మ కాయలు పెట్టుకుని తిరుగుతూ చాలా బిజీబిజీగా ఉంటారు.
రేవణ్ణకు కరోనా పాజిటివ్
ఇటీవల అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ బెంగళూరులో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణకు కరోనా పాజిటివ్ అని బుధవారం వైద్యులు దృవీకరించారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ కాన్వాయ్ తో పాటు ఆయన భద్రతా సిబ్బందిలోని 9 మంది పోలీసులకు కరోనా పరీక్షలు చేశారు. వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.
జేడీఎస్ పార్టీ నాయకుల పూజలు
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కుమారుడు, మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ కు జేడీఎస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తమ అభిమాన నాయకుడికి కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే కర్ణాటకలోని వివిద దేవాలయాల్లో జేడీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హరోహర నువ్వే కాపాడాలి అంటూ పూజలు చేస్తున్నారు. మాజీ మంత్రి హెచ్.డి. రేవర్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ సైతం హాసన్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి పార్టీలో మంచి గుర్తింపు తెచ్చకుంటున్నాడు.
Recommended Video
వీఐపీల జాబితా చాలా పెద్దది గురూ
కర్ణాటకలో ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య చాలా పెద్దదే. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి, విధాన సౌధలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్, మంత్రులు డాక్టర్ సుధాకర్, బళ్లారి శ్రీరాములు, బీసీ పాటిల్ (కౌరవుడు) తో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డారు. సీఎం బీఎస్. యడియూరప్ప, మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు కొందరు వ్యాధి నయం చేసుకుని కోలుకోగా మరికొంత మంది చికిత్స పోందుతున్నారు.