కిల్లర్, రేపిస్టు ఉమేష్ రెడ్డి ఉరి శిక్ష తాత్కాలిక రద్దు
బెంగళూరు: సీరియల్ కిల్లర్, రేపిస్టు ఉమేష్ రెడ్డి ఉరిశిక్ష నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నాడు. సుప్రీం కోర్టు విధించిన ఉరిశిక్షను కర్ణాటక హై కోర్టు గురువారం తాత్కాలికంగా రద్దు చేసింది. అభ్యంతాలు ఉంటే 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాలకు హై కోర్టు నోటీసులు జారి చేసింది.
మహిళలపై దారుణంగా అత్యాచారం చేసిన తరువాత వారిని హత్య చేసి బంగారు నగలతో సహ పారిపోతున్న మాజీ కానిస్టేబుల్ ఉమేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని మీద ఇప్పటి వరకు 23 హత్యలు, అత్యాచారాల కేసులు ఉన్నాయి.
రేపిస్టు, సీరియల్ కిల్లర్ ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష భయం
కోర్టు ఉమేష్ రెడ్డికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఓ కేసులో ఉరిశిక్ష పడింది. తన ఉరిశిక్షను రద్దు చేసి యావజ్జీవకారాగార శిక్ష విధించాలని ఉమేష్ రెడ్డి పెట్టుకున్న అర్జీని హోం శాఖ తిరస్కరించింది.
సుప్రీం కోర్టు సైతం ఇతనికి ఉరిశిక్ష అమలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలోని బెళగావిలోని హిండలగా జైలులో ఉమేష్ రెడ్డిని ఉరి తీయ్యడానికి అన్నీ సిద్దం చేశారు. అయితే ఉమేష్ రెడ్డి కర్ణాటక హై కోర్టు ఆశ్రయించడంతో కామాంధుడు 10 రోజుల పాటు ఊపిరిపీల్చుకున్నాడు.