స్నేహితుడితో నగ్నంగా భార్య రాసలీలలు, కత్తితో చీల్చేసిన భర్త, చెప్పినా వినలేదు!
బెంగళూరు: తన స్నేహితుడితో భార్య నగ్నంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని భర్త ఇద్దరినీ హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు. భర్త కత్తితో చీల్చేయడంతో తీవ్రగాయాలైన భార్య, ఆమె ప్రియుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. హత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు విచారణ చేస్తున్నారు.
స్నేహితులు
కర్ణాటకలోని తుమకూరు పట్టణంలోని ఉప్పారహళ్ళి ప్రాంతంలో రాజారామ్ అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. రాజారామ్, నయాజ్ అహమ్మద్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి స్నేహితులు. రాజారామ్, నయాజ్ అహమ్మద్ భవన నిర్మాణ కార్మికులు (బార్ బైండర్స్)గా పని చేస్తున్నారు.
స్నేహితుడి భార్యతో !
రాజారామ్ ఇంటికి నయాజ్ అహమ్మద్ వెళ్లేవాడు. ఆ సమయంలో రాజారామ్ భార్యను నయాజ్ అహమ్మద్ వలలో వేసుకున్నాడు. రాజారామ్ లేని సమయంలో నయాజ్ అహమ్మద్ ఇంటికి వెళ్లి స్నేహితుడి భార్యతో రాసలీలలు జరిపేవాడు.
తెగించిన భార్య
రాజారామ్ పనికి, పిల్లలు స్కూల్ కు వెళ్లిన సమయంలో అతని భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని రాసలీలలు జరపడం, లేదా నయాజ్ అహమ్మద్ ఇంటికే వెళ్డి కోరిక తీర్చుకోవడం చేసేది. నీ భార్య బరితెగించిందని స్థానికులు ఇద్దరు ముగ్గురు రాజారామ్ కు చెప్పారు. ఈ విషయంపై రాజారామ్ నయాజ్ అహమ్మద్ తో గొడవపడి అతనికి దూరంగా ఉంటున్నాడు.
నగ్నంగా రాసలీలలు
మంగళవారం పనికి వెళ్లిన రాజారామ్ రాత్రి ఇంటికి తిరిగి వెళ్లాడు. అప్పటికే రాజారామ్ భార్య నయాజ్ అహమ్మద్ ఇంటికి వెళ్లింది. అమ్మ ఇంటిలో లేదని పిల్లలు చెప్పడంతో రాజారామ్ కత్తి తీసుకుని ఉప్పరహళ్ళి 2వ క్రాస్ లోని నయాజ్ అహమ్మద్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో నయాజ్ అహమ్మద్ తో కలిసి నగ్నంగా అతని భార్య రాసలీలలో మునిగిపోయిన విషయం గమనించిన రాజారామ్ రగిలిపోయాడు.
భర్త వచ్చినట్లు తెలీదు
భర్త ఇంటిలోకి వచ్చాడని రాజారామ్ భార్య గుర్తించలేకపోయింది. ప్రియుడి నయాజ్ అహమ్మద్ తో కలిసి రాసలీలల్లో మునిగిపోయింది. ఆ విషయం జీర్ణించుకోలేని రాజారామ్ కత్తి తీసుకుని భార్య, ఆమె ప్రియుడి నయాజ్ అహమ్మద్ గొంతులు చీల్చేశాడు. వారిద్దరూ తప్పించుకోవడానికి ప్రయత్నించినా రాజారామ్ విడిచిపెట్టలేదు. కత్తితో ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో ఇద్దరూ కుప్పకూలిపోయారు.
బెంగళూరు ఆసుపత్రి
ఇద్దరి మీద హత్యాయత్నం చేసిన రాజారామ్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు నయాజ్ అహమ్మద్, రాజారామ్ భార్యను తుమకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
ఎవ్వరూ చెయ్యకూడదు !
ఇద్దరి మీద హత్యాయత్నం చేసిన రాజారామ్ తుమకూరులోని జయనగర పోలీసుల ముందు లొంగిపోయాడు.
అక్రమ సంబంధం మానుకోవాలని, పిల్లలు ఉన్నారని, పరువు పోతుందని తన భార్యకు ఎంత చెప్పినా వినలేదని, అందుకే ఇలా చేశానని రాజారామ్ పోలీసుల ముందు అంగీకరించాడు. తన భార్యలా పెళ్లి అయిన ఏ మహిళా ఇలా చెయ్యకూడదని రాజారామ్ ఆవేదనతో అంటున్నాడని పోలీసులు తెలిపారు.