షాక్: మాజీ సీఎం సిద్దూ లాంటి వ్యక్తి ఈ భూమి మీద ఉండకూడదు, బళ్లారి శ్రీరాములు!
బెంగళూరు: జాతిపిత మహాత్ముడిని బలితీసుకున్న గాడ్సెకు భారతరత్న ఇవ్వాలని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య లాంటి వ్యక్తి ఈ భూమి మీద ఉండకూడదని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. వీర్ సావార్కర్ కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపణలు చేశారు. జాతిపిత మహాత్ముడిని బలితీసుకున్న ఘటనలో గాడ్సె కు వీర్ సావార్కర్ కూడా సహాయం చేశారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.
గాడ్సె, వీర్ సావార్కర్ కు భారతరత్న !
వీర్ సావార్కర్ తో పాటు గాడ్సె కు భారతరత్న ఇస్తే బీజేపీ అనుకున్నది సాదించినట్లు అవుతోందని మాజీ సీఎం సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు. మాజీ సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలపై ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు మండిపడ్డారు.
సిద్దరామయ్యకు ఏం తెలుసు ?
చిత్రదుర్గలో మీడియాతో మాట్లాడిన మంత్రి బళ్లారి శ్రీరాములు మాజీ సీఎం సిద్దరామయ్యకు ఆయన నాలుక మీద పట్టులేదని ఆరోపించారు. ఎవరికి భారతరత్న ఇవ్వాలి, ఎవరికి సన్మానం చెయ్యాలి అనే విషయం మాజీ సీఎం సిద్దరామయ్యకు తెలీదని, ఆయన అలాంటి చదువు చిన్నప్పుడు చదువుకున్నారని మంత్రి బళ్లారి శ్రీరాములు ఆరోపించారు. .
సిద్దూకు అహంకారం
వీర్ సావార్కర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుని, ఆయన చరిత్ర గురించి చదువుకుని మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడాలని మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు. ప్రజలను ఇలా రెచ్చగొడుతున్న సిద్దరామయ్య అహంకారంతో రెచ్చిపోతున్నారని, ఆయనకు ప్రజలే సరైన సమాదానం చెబుతారని బళ్లారి శ్రీరాములు అన్నారు.
బీజేపీ చేతిలో కీలు బోమ్మ
ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ నేత బీఎల్. సంతోష్ చేతిలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు నళిన్ కటీల్ కీలు బోమ్మ అయ్యారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఈ విషయంలో మాట్లాడిన మంత్రి బళ్లారి శ్రీరాములు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల చేతిలో మాజీ సీఎం సిద్దరామయ్య కీలు బోమ్మ కాదా అని ప్రశ్నించారు.
సోనియా చేతిలో రిమోట్
ఢిల్లీలో సోనియా గాంధీ రిమోట్ ఒత్తితే ఇక్కడ సిద్దరామయ్య మాట్లాడుతారని, లేదంటే ఆయన మౌనంగా ఉంటారని మంత్రి బళ్లారి శ్రీరాములు ఎద్దేవ చేశారు. సోనియా గాంధీ చేతిలో రిమోట్ అయిన మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ గురించి మాట్లాడటం, ఆరోపణలు చెయ్యడం విడ్డూరంగా ఉందని బళ్లారి శ్రీరాములు మండిపడ్డారు. మాజీ సీఎం సిద్దరామయ్య నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదని, వెనుకా ముందు ఆలోచించుకుని మాట్లాడాలని మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు.