మోడీ షాక్: కాంగ్రెస్ మంత్రికి ఐటీ సమన్లు, విచారణకు హాజరైన డీకే బ్రదర్స్ అండ్ కో !
ఆదాయపన్ను శాఖ అధికారులు సమన్లు జారీ చెయ్యడంతో కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ సోమవారం విచారణకు హాజరైనారు. మంత్రి డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు.
బెంగళూరు: ఆదాయపన్ను శాఖ అధికారులు సమన్లు జారీ చెయ్యడంతో కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ సోమవారం విచారణకు హాజరైనారు. మంత్రి డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా పార్లమెంట్ సభ్యుడు (కాంగ్రెస్) డీకే. సురేష్ విచారణకు హాజరైనారు.
మోడీ దెబ్బ: ఐటీ షాక్, చెవిలోపువ్వు పెట్టుకుని రాలేదు, రాజకీయం చెయ్యడానికి, చూపిస్తా: డీకే !
బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయం నాలుగో అంతస్తులో మంత్రి డీకే. శివకుమార్, డీకే. సురేష్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎస్. రవి, ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకనాథ్ తదితరులను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారరణ చేస్తున్నారు.
మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు పరిశీలించిన అధికారులు ముందుగానే ప్రశ్నలు సిద్దం చేసుకుని తరువాత మంత్రి డీకే. శివకుమార్ తో సహ మిగిలిన వారికి సమన్లు జారీ చేసి విచారణ మొదలు పెట్టారు.
మోడీ ఎఫెక్ట్: గుజరాత్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మళ్లీ రిసార్ట్ కు, వదలం, ఓటు వేస్తేనే !
మంత్రి డీకే. శివకుమార్ సన్నిహితుడు, ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకనాథ్ విచారణలో ఏం చెబుతారో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంత్రి దగ్గర వివరణ తీసుకున్న తరువాత అధికారులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలిసింది.