వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మంత్రి ఆగ్రహం.. హిజ్రాలంటూ సంచలన వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హిజ్రాలతో పోల్చడం చర్చానీయాంశంగా మారింది. ఆదివారం నాడు బహిరంగ సభలో మంత్రి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు హిజ్రాల ప్రవర్తన తలపిస్తోందని సదరు మంత్రి వ్యాఖ్యానించిన తీరు కలకలం రేపుతోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ముస్లిం మైనార్టీల ఓట్లు తమకు పడబోవనే కారణంతో వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు.

Karnataka Minister KS Eshwarappa Dig At Congress MLAs

కోడెల మృతిపై నేతలు ఏమన్నారంటే..!కోడెల మృతిపై నేతలు ఏమన్నారంటే..!

బీజేపీకి ఓట్లు వేయడానికి దేశ భక్తి ఉన్న ముస్లింలు వెనుకాడబోరని.. అదే సమయంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడేవారు, దేశ వ్యతిరేకులు మాత్రం బీజేపీకి ఓటు వేయబోరంటూ మరో సెన్సెషనల్ కామెంట్ చేశారు. అదలావుంటే తాను మాత్రం ముస్లిం మైనార్టీ వర్గానికి దగ్గర కావాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ చెప్పుకో దగ్గ ఓట్లతో తాను ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చారు.

English summary
Karnataka Minister KS Eshwarappa Dig At Congress MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X