బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాధారణ చీరతో సామూహిక వివాహంలో పెళ్లాడిన మంత్రి కూతురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఏ మంత్రి అయినా తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తారు! ఓ ఎమ్మెల్యే అయితేనే తమ పిల్లల పెళ్లి ఘనంగా జరిపిస్తారు. అయితే, కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి మాత్రం తన కూతురు పెళ్లిని సాముహిక వివాహాలలో జరిపించారు.

Karnataka Minister's Daughter Marries in Mass Wedding Ceremony

బలహీనవర్గాలకు చెందిన 96 జంటలతో పాటు తన కుమార్తె పెళ్లిని సదరు మంత్రి జరిపించారు. కర్నాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్ ఆంజనేయులు కూతురు అనుపమ ఈ నెల 19వ తేదీన చిత్రదుర్గలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి ఎలాంటి నగలు ధరించకుండా మామూలు చీరలో వచ్చి పెళ్లిపీటల పైన కూర్చున్నారు.

అందరితో పాటు ప్రభుత్వం ఇచ్చిన మంగళసూత్రాన్ని కట్టించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆంజనేయులు మాట్లాడుతూ.. తన కూతురు ఎన్నో ఫైవ్ స్టార్ హోటళ్లలో విందులు, వినోదాలకు హాజరయిందని, ఎంతోమంది ఉన్నత కుటుంబాల పెళ్లిళ్లకు వచ్చిందని కాని, ఇలా అన్నీవదిలి సాధారణ పెళ్లి చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన కూతురు నిర్ణయం ఓ రాజకీయ సందేశాన్ని ప్రజలకు ఇచ్చిందన్నారు.

English summary
The daughter of a Karnataka minister surveyed the best hotels in Bengaluru before marrying a company executive at a venue that she shared with 96 other couples last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X