సిద్దరామయ్యను సీఎం చేస్తాం, సీఎంకు షాక్ ఇచ్చిన మంత్రి శివశంకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరాయయ్యను చెయ్యడానికి అందరికీ ఇష్టమే అని, రెండు పార్టీల సమన్వయ కమిటీ ఆమోదిస్తే అది సాధ్యం అవుతోందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ఎన్.హెచ్. శివశంకర్ రెడ్డి బాంబు పేల్చారు. సీఎం కుమారస్వామికి షాక్ ఇచ్చిన శివశంకర్ రెడ్డి ఎమ్మెల్యేలు అంగీకరిస్తే అది సాధ్యం అవుతోందని అన్నారు.
సీఎంను తప్పించాలి !
చామరాజనగర్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి శివశంకర్ రెడ్డి రెండు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు కూర్చుని సిద్దరామయ్యను సీఎం చేసే విషయంలో చర్చించాలని అన్నారు. సీఎం కుమారస్వామిని సీఎం పదవి నుంచి తప్పించాలని అందరూ సూచిస్తే తాము మద్దతు ఇస్తామని శివశంకర్ రెడ్డి అన్నారు.
ముహుర్తం ఫిక్స్
సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి కుమారస్వామి పదవి నుంచి తప్పుకుంటారని, వేరే వారికి అవకాశం వస్తోందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇదే సమయంలో హాసన్ జిల్లాలో మాట్లాడిన మాజీ సీఎం సిద్దరామయ్య తాను మళ్లీ సీఎం అవుతానని చెప్పడంతో కొత్త చర్చకు తెరలేసింది.
బీజేపీకి అవకాశం !
ఆపరేషన్ కమలతో బీఎస్. యడ్యూరప్ప సీఎం అవుతారని జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు యడ్యూరప్పతో టచ్ లో ఉన్నారని, వారి మద్దతుతో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కుర్చి కోసం కాదు !
ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ తాను సీఎం కుర్చిని కాపాడుకోవడానికి సమయం వృదా చేసుకోనని, ప్రజలకు సేవ చెయ్యడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, ఎవరి మాటలు పట్టించుకోనని అన్నారు.
ఎన్ని రోజులు సీఎం ?
ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నామని కాదు, ప్రజలకు ఎంత సేవ చేశాం, ఎలాంటి అభివృది పనులు చెయ్యాలా అని ఆలోచిస్తానని సీఎం కుమారస్వామి అంటున్నారు. కుమారస్వామిని సీఎం కుర్చి నుంచి తప్పించడానికి జేడీఎస్ నాయకులు సిద్దంగా లేరు.
Recommended Video
బాంబు పేలింది
ఇలాంటి సమయంలో సీఎం కుమారస్వామి మంత్రి వర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివశంకర్ రెడ్డి మళ్లీ సిద్దరామయ్యను సీఎం చేస్తామని బాంబు పేల్చడంతో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం ఉలిక్కిపడింది. సీఎంను మార్చడానికి తాము సిద్దంగా ఉన్నామని మంత్రి శివశంకర్ రెడ్డి బాంబు పేల్చడంతో కొత్త చర్చకు తెరలేపింది.