మహిళా ఐపీఎస్ అధికారి మీద మంత్రి చిందులు, కన్నీరు, సోషల్ మీడియాలో శాపనార్తాలు !
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి మహిళా ఐపీఎస్ అధికారి మీద మంత్రి విరుచుకుపడ్డారు. అందరూ చూస్తున్న సమయంలో మహిళా ఐపీఎస్ అధికారి మీద మంత్రి సా.రా. మహేష్ బహిరంగంగా దూషణకుదిగడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి తీరుపై సోషల్ మీడియాలో పలువురు మంత్రి సా.రా. మహేష్ కు శాపనార్తాలు పెడుతున్నారు.
మంగళవారం తుమకూరు సమీపంలోని సిద్దగంగా మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ అంత్యక్రియలకు మంత్రి సా.రా. మహేష్ హాజరైనారు. అక్కడ తుమకూరు జిల్లా ఎస్ పీ దివ్యా గోపినాథ్ ఉన్నారు. ఆ సందర్బంలో మంత్రి సా.రా. మహేష్ మహిళా ఐపీఎస్ అధికారి దివ్యా గోపినాథ్ ను కఠినంగా మాట్లాడారు.
మంత్రి సా.రా. మహేష్ తీరుతో ఐపీఎస్ అధికారి దివ్యా గోపినాథ్ సంఘటనా స్థలంలోనే కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి సా.రా. మహేష్, మహిళా ఐపీఎస్ అధికారి దివ్యా గోపినాథ్ మద్య వాగ్వివాదం మొదలు కావడంతో స్థానిక నాయకులు, సీనియర్ పోలీసు అధికారులు జోక్యం చేసుకున్నారు.
మంత్రి సా.రా. మహేష్ కు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించి ఐపీఎస్ అధికారి దివ్యా గోపీనాథ్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో తీసిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళా ఐపీఎస్ అధికారి దివ్యా గోపీనాథ్ తో మంత్రి సా.రా. మహేష్ ప్రవర్తించిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మంత్రి సా.రా. మహేష్ కు శాపనార్తాలు పెడుతున్నారు.