ప్రభుత్వం సంచలనం, రెండు లక్షల ఇళ్లు ఫ్రీ.. ఫ్రీ, ఎవరికంటే, పక్క రాష్ట్రాంలో ఎలక్షన్స్ !
బెంగళూరు: పదేళ్లుగా మరుగున పడిన 2. 32 లక్షల ఇళ్లను ఉచితంగా ఇచ్చేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరించారని ఆ రాష్ట్ర గృహనిర్మాణ, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. శుక్రవారం బెంగళూరులో మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ విలేఖరులతో మాట్లాడుతూ నిరుపేదలకు కప్పులు అందించేందుకు స్లమ్ డెవలప్మెంట్ బోర్డు, రాజీవ్గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ రూపొందించిన పథకం లబ్ధిదారులకు చెల్లించడంలో విఫలమైందని, ఇకపై ప్రభుత్వమే మొత్తం భరిస్తుందని అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు ఉచిత హామీలతో పాటు ఆరో హామీగా అసంపూర్తిగా ఉన్న 2. 32 లక్షల ఇళ్లను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లక్ష్యంగా పెట్టుకున్నారని కర్ణాటక మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ అన్నారు. రూ. 8, 000 కోట్ల విలువైన 2. 32 లక్షల ఇళ్లు ఉచితంగా ఇస్తామని హంపిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు.

పేదలకు అందించాల్సిన ఉచిత ఇళ్లు దశలవారీగా అందజేస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ చెప్పారు. వచ్చే వారం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ అన్నారు. ఈ నిర్ణయం వల్ల 2. 32 లక్షల కుటుంబాలకు త్వరలో సొంత ఇంటి కల నెరవేరుతుందని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ చెప్పారు.
బ్యాంకు రుణం అందక ఆందోళనకు గురైన వారికి ఊరట లభిస్తుందని, లబ్ధిదారులకు ఇల్లు అందుతుందని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ చెప్పారు. స్లమ్ డెవలప్మెంట్ బోర్డ్, రాజీవ్ గాంధీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నిర్మించిన ఇంటి యూనిట్ ధర రూ. 7 లక్షలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 3 లక్షల సబ్సిడీ ఉంటుందన మత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ వివరించారు. మిగిలిన నాలుగు లక్షల రూపాయలు . లబ్ధిదారులు చెల్లించాల్సి వచ్చింది. ఇకపై లబ్ధిదారుల వాటా ఖర్చును ప్రభుత్వమే భరించాలని నిర్ణయించిందని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications