వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ ఐతేనే సేఫ్: పార్క్ హయత్-తాజ్ హోటల్స్‌కు కర్ణాటక ఎమ్మెల్యేలు, అర్ధరాత్రి నుంచే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

హైదరాబాద్ కు ఎమ్మెల్యేలను తరలిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్

హైదరాబాద్/బెంగళూరు: కర్ణాటక రాజకీయం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారింది. కాంగ్రెస్ పార్టీకి, జేడీఎస్‌లకు చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే వారి రాక ప్రారంభమైంది. అర్ధరాత్రి కొందరు రాగా, ఆ తర్వాత కొందరు కార్లలో, బస్సుల్లో వస్తున్నారు. ఎమ్మెల్యేల బస ఏర్పాట్లను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

పార్క్ హయత్‌తో పాటు తాజ్ కృష్ణకు కర్ణాటక ఎమ్మెల్యేలు వచ్చారు. గురువారం అర్థరాత్రి కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌ హోటల్‌కు చేరుకోవడంతో రాజకీయం తెలంగాణ రాజధానికి మారింది. అర్థరాత్రే కొందరు హోటల్‌కు చేరుకోగా, మరికొందరు ఆ తర్వాత వచ్చారు.

Karnataka MLAs reached Hyderabad, will stay in Taj and Park hyatt Hotels

ఎమ్మెల్యేలను సురక్షితంగా కాపాడుకోవడానికి హైదరాబాద్ సరైన ప్రదేశమని కాంగ్రెస్‌, జేడీఎస్‌ భావించి ఇక్కడికి తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్క్‌ హయత్‌ హోటల్‌తో పాటు నగర శివారులోని పలు హోటళ్లు, రిసార్ట్స్‌లోనూ ఎమ్మెల్యేల కోసం గదులు బుక్‌ చేసినట్లు తెలుస్తోంది.

కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు రెండు ట్రావెల్ బస్సుల్లో హైదరాబాద్ వచ్చారు. దాదాపు అందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి కాపాడుకునేందుకే హైదరాబాద్ చేర్చారని తెలుస్తోంది.

English summary
Congress MP from Karnataka, DK Suresh, says, 'They (MLAs) are coming here, we are arranging everything here. We are waiting for them, in another 2 hours they will come, JD(S) and Congress both.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X