కర్ణాటకలో ప్రైవేటు ఆసుపత్రులు బంద్, ప్రభుత్వం నిర్ణయంపై వైద్యుల నిరసన, ఎందుకంటే !
కర్ణాటక వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రలు బంద్వైద్యుల ఆందోళన, రోగులకు నానా ఇబ్బందులుప్రభుత్వ నిర్ణయంపై కార్పొరేట్ ఆసుపత్రుల నిరసన
బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ఒక్క రోజు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. నవంబర్ 3వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటలకే బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని ఆసుపత్రులు మూసి వేసి ఆందోళన చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో 70 శాతం మంది రోగులు చికిత్స అందక ఇంటికి వెనుతిరుగుతున్నారు.
ప్రైవేటు ఆసుపత్రులకు కర్ణాటక ప్రభుత్వం అనేక షరతులు విధిస్తూ ప్రత్యేక చట్టం తీసుకురావడానికి సిద్దం అయ్యింది. కర్ణాటక ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకు వస్తున్న ప్రత్యేక చట్టాన్ని కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వహకులు గట్గిగా వ్యతిరేకిస్తు నవంబర్ 3వ తేదీ ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఆసుపత్రులు మూసి వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రోగుల దగ్గర ఎక్కువ నగదు వసూలు చెయ్యరాదని, ఎక్కువ బిల్లులు వసూలు చేస్తే రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకూ అపరాధ రుసుం విధించాలని, నియమాల్లు ఉల్లంఘిస్తే ఆరు నెలల నుంచి మూడేళ్లు జైలు శిక్ష విధించాలని, రోగి చనిపోతే మృతదేహం అప్పగించే ముందు మొత్తం బిల్లు చెల్లించాలని డిమాండ్ చెయ్యకూడదని కర్ణాటక ప్రభుత్వం అంటోంది.
ప్రైవేటు ఆసుపత్రులు సంబంధిత బోర్డులో కచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకురావడానికి సిద్దం అయ్యింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు మూసి వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం మాత్రం కర్ణాటక ప్రైవేటు మెడికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం (కేపీఎంఏ) 2017 తీసుకురావాలని నిర్ణయించింది. ప్రైవేటు ఆసుపత్రులు మూసి వేయడంతో ప్రభుత్వం ఆసుపత్రుల వైద్యులను అలర్ట్ చేశారు.