కర్ణాటక రిజల్ట్స్: శశికళ మరోసారి గెలుపు, ఆమె భర్త అన్నాసాహెబ్ మరోసారి ఓటమి
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బిజెపి అభ్యర్ధులుగా బరిలోకి దిగిన భార్య, భర్తల్లో భార్య మాత్రమే విజయం సాధించారు. భర్త మాత్రం ఓటమిని మూటగట్టుకొన్నారు. వీరిద్దరి గెలుపు కోసం బిజెపి అగ్రనాయకత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. కానీ, భార్య మాత్రమే విజయం సాధించింది.
కర్ణాటకలోని నిఫ్పానీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్ధిగా శశికళ విజయం సాధించారు. బెళగాం జిల్లాలోని నిఫ్పానీ సెగ్మెంట్ నుండి బిజెపి అభ్యర్ధిగా ఆమె పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించారు.
అయితే ఈ ఎన్నికల్లో శశికళ భర్త అన్నాసాహెబ్ చిక్కోడి సదలగా సెగ్మెంట్ నుండి బిజెపి అభ్యర్ధిగా బరిలో దిగారు. కానీ, ఈ దఫా కూడ ఆయన ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి గణేస్ హుక్కేరీ చేతిలో ఓటమి పాలయ్యారు.
వీరిద్దరి గెలుపు కోసం బిజెపి అగ్రనేతలు అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి మోడీ కూడ ప్రచారం నిర్వహించారు. కానీ, శశికళ మాత్రమే ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. అన్నా సాహెబ్ గత పదేళ్ళుగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆయన ఇంతవరకు విజయం సాధించలేదు. ఇప్పటివరకు శశికళ రెండు దపాలు ఎమ్మెల్యేగా విజయం సాధించింది.