'బీజేపీకి 120 సీట్లు ఖాయం': అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి ముందంజ
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ఆ పార్టీ నేత సదానంద గౌడ అన్నారు. బీజేపీ కచ్చితంగా 120 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. మరోవైపు, మల్లేశఅవరం నుంచి బీజేపీ అభ్యర్థు అశ్వథ్ నారాయణ విజయం సాధించారు. బెంగళూరు రీజియన్లోని 28 నియోజకవర్గాలకు గాను 26 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.
కర్నాటకలో హంగ్!: జేడీఎస్తో బీజేపీ-కాంగ్రెస్ నేతల మంతనాలు, కుదరకుంటే చీలిక?
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. జేడీఎస్ మద్దతు అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్లు జల్లినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ డెబ్బై స్థానాల్లో ముందంజలో ఉంది.
బళ్లారి గ్రామీణంలో బీజేపీ అభ్యర్థి సణ్ణ ఫకీరప్ప, కంప్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సురేష్ బాబు ముందంజలో ఉన్నారు. బళ్లారి ప్రాంతంలో బీజేపీ 5 స్థానాల్లో, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్కు చెందిన సర్వేపల్లి రాధాకృష్ణ మనవడు సుబ్రహ్మణ్య శర్మ వెనుకంజలో ఉన్నారు. మరోవైపు చిక్మగ్ళూరు జిల్లాలోని తరికెరె నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు.