వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ పోర్టులో మాజీ సీఎంల మంతనాలు, కొత్త రాజకీయాలకు తెరలేచిందా, తీవ్రస్థాయిలో చర్చ!

|
Google Oneindia TeluguNews

హుబ్బళి (కర్ణాటక): ప్రతినిత్యం ఎదో ఒక విషయంలో విమర్శలు చేసుకుంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ఒకే చోట కలిసి ఒకరిని ఒకరు ఉల్లాసంగా పలకరించుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, యడ్యూరప్ప భేటీ కావడంతో కొత్త రాజకీయాలకు తెరలేసిందా అంటూ చర్చ మొదలైయ్యింది. మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, యడ్యూరప్పల భేటీ కొత్త రాజకీయాలకు నాంధి అంటూ కర్ణాటకలో ఇప్పుడు చర్చ మొదలైయ్యింది.

Karntaka former chief ministers BS Yeddyurappa and Siddaramaiah met with each other in Hubballi airport.

హుబ్బళిలో జరుగుతున్న వేర్వేరు కార్యక్రమాలకు హాజరుకావడానికి మాజీ ముఖ్యమంత్రులు బీఎస్. యడ్యూరప్ప, సిద్దరామయ్య ఒకే విమానంలో బెంగళూరు నుంచి హుబ్బళి వెళ్లారు. హుబ్బళి ఎయిర్ పోర్టులో ఇద్దరు విమానం దిగిన సమయంలో ఒకరి గురించి ఒకరు వివరాలు తెలుసుకుని ముచ్చటగా చర్చించుకున్నారు.

వేరేవేరే కార్యక్రమాలకు హాజరు కావలసిన మాజీ ముఖ్యమంత్రులు బీఎస్. యడ్యూరప్ప, సిద్దరాయ్య హుబ్బళి ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో నిత్యం దళితులకు అన్యాయం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ వాపోయిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ దళితులకు న్యాయం జరగలేదని, అన్యాయం జరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో నిత్యం దళితులకు మోసం జరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి బీఎస్, యడ్యూరప్ప విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రులు భేటీ విషయంలో ఏమి చర్చ జరిగిందని మీడియా యడ్యూరప్పను ప్రశ్నించగా ఈ విషయంపై సిద్దరామయ్యను ప్రశ్నించాలని యడ్యూరప్ప చిన్నగా తప్పించుకున్నారు.

English summary
Karntaka former chief ministers BS Yeddyurappa and Siddaramaiah met with each other in Hubballi airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X