హంద్వారా: వెంటాడి ఉగ్రవాదుల్ని హతమార్చిన ఆర్మీ, పాక్ మెడిసిన్స్ లభ్యం
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని హాంద్వారాలో ఆర్మీ క్యాంప్ పైన దాడి చేసిన ఘటనలో ముగ్గురు తీవ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. తద్వారా హంద్వారాలో ఎన్కౌంటర్ ముగిసింది. గురువారం ఉదయం హంద్వారాలో ముగ్గురు తీవ్రవాదులు ఆర్మీ క్యాంప్ పైన కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
సైన్యం కాల్పులను తిప్పికొట్టింది. ఎట్టకేలకు చివరకు ఉగ్రవాదులను హతమార్చింది. కాల్పులకు పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్లో తయారైన మెడిసిన్ వారి వద్ద లభ్యమైంది.
ఉదయాన్నే ఆర్మీ క్యాంప్పై ఉగ్రదాడి, ఇద్దరు ఉగ్రవాదుల్ని చంపిన సైన్యం
ఉగ్రవాదులు లాంగేట్ వద్ద రెండు ప్రాంతాల్లో కాల్పులు జరిపారని ఆర్మీ తెలిపింది. అనంతరం వారు పారిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు. కానీ ఆర్మీ, ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ పోలీసులు వారిని వెంబడించి ఎన్కౌంటర్ చేశారని చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు.