వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే, పాక్‌కి మద్దతు ఇవ్వం: తేల్చేసిన తాలిబన్

|
Google Oneindia TeluguNews

కాబూల్: కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఆ దేశ అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్ స్పష్టం చేసింది. ఉగ్రవాద సంస్థగా పేరున్న తాలిబన్.. భారతదేశం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

పాకిస్థాన్ నేతృత్వంలో కాశ్మీర్‌లో జిహాద్‌కు తాలిబన్ రంగంలోకి దిగుతుందని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్(తాలిబన్) మీడియా ప్రతినిధి సుహైల్ షాహీన్ ఈ మేరకు స్పందించారు.

ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ తాము తలదూర్చబోమని షాహీన్ స్పష్టం చేశారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఈ విషయంలో తాము పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

Kashmir India’s internal affair, cant support Pakistan: Taliban

కాగా, కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు భారతదేశంతో స్నేహం చేసేది లేదంటూ తాలిబన్ మీడియా ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, భారత్ కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు ఫేక్ అని తేలింది. తాలిబన్‌కు ఈ పోస్టులతో సంబంధం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాలిబన్ సంస్థ స్పందించి.. ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది.

English summary
The Taliban on Monday, in a tweet, clarified that it does not support Pakistan’s ‘holy war’ against India and that Kashmir was India’s internal matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X