పూర్తయిన ఘట్టం: జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్సభ ఆమోదం
జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు బిల్లు పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 367 మంది సభ్యులు ఓటువేయగా.. వ్యతిరేకంగా 67 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లు పాస్ అయినట్లుగా స్పీకర్ ఓంబిర్లా డిక్లేర్ చేశారు. అంతేకాదు జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు ప్రతిపాదించిన తీర్మానంకు కూడా సభ ఆమోదం పొందింది. మరోవైపు రిజర్వేషన్లపై కూడా లోక్సభ ఆమోదం తెలిపింది.
సోమవారం రోజున జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అక్కడ 125 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఆమోదం తెలపగా.. 61 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు.
I support the move on #JammuAndKashmir & #Ladakh and its full integration into union of India.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 6, 2019
Would have been better if constitutional process had been followed. No questions could have been raised then. Nevertheless, this is in our country’s interest and I support this.