కేబీసీలో అమితాబ్తో డ్యాన్సు, అధికారులకు నోటీసులు
వివరాల్లోకి వెళితే ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన కేబీసీ షో రికార్డింగ్లో అదనపు కార్యదర్శి ఎంకే రౌత్, జాయింట్ సెక్రటరీ విక్రమ్ సిసోడియా (ఈయన సీఎం రమణ్ సింగ్ పేషీలో ఓఎస్డీ కూడా) పాల్గొన్నారు. కార్యక్రమం మధ్యలో వీరు వేదికపైకి వెళ్ళి అమితాబ్ తో కలిసి 'మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై' పాటకు డ్యాన్సు చేశారు.
ఆ డ్యాన్స్ ఇప్పుడు వీరికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ డ్యాన్స్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆగ్రహించారని సమాచారం. సీఏం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివేక్ చంద్ వీరిద్దరినీ మందలిస్తూ నోటీసులు పంపారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం చేయరాదంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) రాయ్ పూర్ ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు. ఈ ఇరువురు అధికారులపై కొందరు చేసిన ఫిర్యాదుల కారణంగానే సీఎం రమణ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.