వివాదాస్పద వ్యాఖ్యలు: 'వాళ్లు హిందువులు కాదు, ఆలయ విశ్వసనీయత దెబ్బతింటుంది'
న్యూఢిల్లీ: జ్యోతిమఠం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయ పూజారులు హిందువులు కాదని, వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాఖండ్లోని చమోలిలో మీడియాతో మాట్లాడుతూ కేదార్నాథ్ హిందూ దేవాలయమని, అయితే పూజారులు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారని అన్నారు. లింగాయత్ సామాజిక వర్గీయులు తమను తాము హిందువులుగా పరిగణించరని, అలాంటప్పుడు వారెలా పూజారులుగా కొనసాగుతారని మండిపడ్డారు.
బద్రీనాథ్ క్షేత్ర పూజారులకు ఇది వర్తిస్తుందని అన్నారు. బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసివేసిన తర్వాత, పూజారులు జోషిమఠంలో ఉండాల్సింది పోయి, దేశ సంచారం చేస్తున్నారని విమర్శించారు. వారు ప్రవర్తించే తీరు బద్రినాథ్ ఆలయ విశ్వసనీయత దెబ్బతీసే విధంగా ఉందన్నారు.
అలాంటి వారు కొంత కాలం బ్రహ్మచర్యం పాటించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుటుందని ఆరోపించారు.