వారణాసి లో బీఎస్ఎఫ్ మాజీ జవాన్ పోటి , ప్రధాని మోదీకి సవాలే : కేజ్రీవాల్
వారణాసిలో ప్రధాన మంత్రి మోడిపై పోటి చేస్తున్న మహా ఘట్బంధన్ ,సమాజ్ వాది పార్టీ అభ్యర్థి గా పోటి చేస్తున్న బిఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ పై ప్రశంశల జల్లు కురిపించారు ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ . ఈనేపథ్యంలోనే తేజ్ బహదూర్ యాదవ్ వారణాసిలో నామినేషన్ వేసి ప్రధాని మోదీకి సవాల్ విసిరారని అన్నారు. మరోవైపు హర్యాన మట్టిలో ఎదో దాగి ఉందని అన్నారు. 2014 లో కూడ హర్యాన కు చెందిన వ్యక్తి మోడిపై పై పోటి చేశారని తనకు తాను వారణాసిలో మోడిపై పోటి చేసిన అంశాన్ని గుర్తు చేశాడు.
కాగా తేజ్ బహదూర్ యాదవ్ రెండు సంవత్సరాల క్రితం పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న జవాన్లకు ఆహరం అందించే విషయంలో పలు ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. అనంతరం ఆయనపై విచారణ చేపట్టిన అధికారులు ఉద్యోగం నుండి తొలగించారు. ఈనేపథ్యంలోనే ఆయన మోడీపై పోటి చేస్తున్నట్టు ప్రకటించారు.దీంతో సమాజ్ వాదీ పార్టీ టికెట్ కేటాయించింది.