వస్తే సంతోషం: కేజ్రీవాల్, మాకు సిగ్గులేదా: భూషణ్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ మళ్లి పార్టీలోకి వస్తే చాల సంతోషిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రయివేటు టీవీ చానెల్ తో మాట్లాడారు.
ఆ ఇద్దరు నేతలు ఒక వేళ మళ్లి ఆప్ లోకి వస్తే అందరికి మంచిదే కదా అని అన్నారు. అయితే ఆప్ లో ఒంటెత్తు పోకడల వల్లనే ఆ ఇద్దరు నేతలు పార్టీలోకి రావడం లేదనే ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు.
పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లను ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో పార్టీ నుండి బహిష్కరించారు. తరువాత వారిద్దరు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద బహిరంగంగా మండిపడ్డారు.
అయితే అరవింద్ కేజ్రీవాల్ పార్టీలోకి ఆహ్వానించడంపై ప్రశాంత్ భూషణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రోజు జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆప్ శాసన సభ్యులతో తమ మీద దాడి చేయించిన అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సిగ్గులేకుండా మళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని విరుచుకుపడ్డారు.