తల తెమ్మన్న గంటల్లోనే ఆర్ఎస్ఎస్ ఆఫీస్పై బాంబు దాడి: నలుగురికి తీవ్రగాయాలు
కేరళ నాదపురం సమీపంలోని కలాచీ వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యాలయంపై గురువారం రాత్రి జరిగిన బాంబుదాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు
తిరువనంతపురం: కేరళ నాదపురం సమీపంలోని కలాచీ వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యాలయంపై గురువారం రాత్రి జరిగిన బాంబుదాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన బాబు, వినీష్లను కోజికోడ్ మెడికల్ కాలేజీకి, సుధీర్, సునీల్లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంపై క్రూడ్ బాంబు విసిరినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీపీఐ, ఆరెస్సెస్ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయి.
#Visuals Bomb hurled at RSS office in Kallachy near Nadapuram, Kerala. 3RSS workers injured, shifted to Government Medical College,Kozhikode pic.twitter.com/l1uNGLsW0F
— ANI (@ANI_news) March 2, 2017
కాగా, కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తలు వరుసగా హత్యకు గురవుతుండడం వెనక ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాత్ర ఉందని, అతని తల తెచ్చిచ్చిన వారికి కోటి రూపాయలు నజరానా ఇస్తానని మధ్యప్రదేశ్కు చెందిన 'షా ప్రచార్ ప్రముఖ్' కుందన్ చంద్రావత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన అలా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆరెస్సెస్ కార్యాలయంపై బాంబు దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీపీఎం కార్యాలయం దగ్ధం
కేరళ ముఖ్యమంత్రి విజయన్పై ఆర్ఎస్ఎస్ నేత కుందన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో వివాదానికి తెరతీశాయి. గురువారం ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి చేయగా.. తాజాగా సీపీఎం కార్యాలయంపైనా దాడి జరిగింది. కోజికొడెలోని సీపీఎం కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.