వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona lockdown: ప్రేమజంట విరహ వేదన, లేచిపోయిన కపుల్, మేజిస్ట్రేట్ ఓకే.. కానీ ఈ సమయంలో..

|
Google Oneindia TeluguNews

ప్రేమికుల పాలిట కూడా కరోనా వైరస్ శాపంగా మారుతోంది. ఒక్కటైన ప్రేమ పక్షులు విరహ వేదన భరించలేకపోతున్నారు. ఎలాగూ ప్రేమించుకున్నాం.. పెద్దలు ఒప్పుకోవడం లేదని అనుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్ ఉందని మరచిపోయారు. ఇంట్లో నుంచి లేచిపోతే.. పోలీసులు పట్టుకున్నారు. కానీ ఇద్దరు మేజర్లు అవడంతో కోర్టు కూడా ఓకే చెప్పింది. కానీ ఆ షరతు విధించడంతో ప్రేమికుల పాలిట శాపంగా మారింది.

లేచిపోయిన జంట

లేచిపోయిన జంట

కేరళలోని తమరాస్సేరికి చెందిన జంట.. ప్రేమలో మునిగిపోయారు. వీరిద్దరూ మతాలు వేరు కానీ మనసులు ఒక్కటయ్యాయి. తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పడంతో అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ చర్చించుకొని.. శనివారం ఇంటి నుంచి పారిపోయారు. కానీ విషయం తెలియని అమ్మాయి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే గాలింపు చేపట్టగా.. ఆ మరునాడే జంట పోలీసు స్టేసన్‌కు వచ్చింది. వెంటనే వారిని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రెట్ ఎదుటహాజరుపరిచారు.

లేచిపోయేందుకు ఓకే.. కానీ...

లేచిపోయేందుకు ఓకే.. కానీ...

జడ్జీ ఎదురుగా తన సమ్మతంతోనే వెళ్లానని యువతి పేర్కొన్నది. వాళ్లిద్దరూ మేజర్లు కావడంతో మేజిస్ట్రేట్ కూడా అభ్యంతరం తెలుపలేదు. దీంతో జంట ఊపిరి పీల్చుకున్నారు. కానీ మేజిస్ట్రేట్ ఒక షరతు విధించారు. ఆ జంట నిబంధనలను ఏమైనా అతిక్రమించారా అని అడిగారు. లాక్‌డౌన్ ఉన్న సమయంలో పారిపోయారని పోలీసులు తెలిపారు. దీంతో జంట షాక్‌నకు గురైంది.

లాక్‌డౌన్

లాక్‌డౌన్

లాన్ డౌన్ సమయంలో ఆస్పత్రికి, మెడికల్ షాపుకు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఉందని.. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసందుకు కూడా పర్మిష్ ఉంది అని పోలీసులు చెప్పారు. కానీ ఆ జంట ఏకంగా లేచిపోయారని పేర్కొన్నారు. ఇది అత్యవసరం కాదని తెలిపారు. ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

యథేచ్చగా..

యథేచ్చగా..

కేరళలో ప్రేమ జంట కాదు.. చాలామంది లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాపిస్తోంది. కేరళలో 336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 263 మంది చికత్స పొందుతుండగా.. 71 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు చనిపోయారని కేరళ అధికారులు పేర్కొన్నారు.

Recommended Video

T20 World Cup: Early Monsoon Cheer Up Women's Cricket Team

English summary
Kerala couple is eloping and violating lockdown rules in Kerala. thet have been booked by police for leaving their homes for a cause that was not an emergency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X