వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ వరదలు: వీపునే మెట్టుగా మార్చిన మత్స్యకారుడు, ప్రశంసల జల్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

కేరళ వరదలు: మత్స్యకారుడుపై కురుస్తున్న ప్రశంసల జల్లు...!

తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్‌లతో పాటు మత్స్యకారులు, ఆరెస్సెస్ కూడా సహాయం అందిస్తోంది. వరద బాధితులను ఆదుకునేందుకు టోపీ లేని మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యంతో పాటు స్థానిక మత్స్యకారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: కేరళ వరదలు: రూ.12వేల కోట్ల పేటీఎం అధినేత విరాళం రూ.10వేలు

మత్స్యకారులు కూడా ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్నారు. ఓ వృద్ధురాలిని కాపాడేందుకు ఓ మత్స్యకారుడు తన వీపునే మెట్టుగా మార్చాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి అతడు అందించాడు. తనూర్‌కు చెందిన జైసల్‌ కేపీ మత్స్యకారుడు. చిన్నపిల్లతో పాటు వరదల్లో చిక్కుకున్న ఓ తల్లి, వృద్ధురాలి ఆచూకీలను కనిపెట్టడంలో ఈయన ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు తోడ్పడ్డారు.

అనంతరం వృద్ధురాలిని పడవలోకి ఎక్కించేందుకు ఆ మత్స్యకారురుడు తన వీపును మెట్టుగా మార్చాడు. వరద నీళ్లలో మోకాళ్లపై ఆయన ముందుకు వంగాడు. ఆయనపైకి ఎక్కి ఆమె పడవలోకి చేరుకారున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు మత్స్యకారుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Kerala fisherman bends down to pave way for women to get into rescue boat, lauded

కేరళ వ్యాప్తంగా దాదాపు 600 మంది మత్స్యకారులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

కేరళకు రైళ్లలో నీరు, ఆహారం, మందులు

నైరుతి రైల్వే అధికారులు నీరు, ఆహారం, బిస్కెట్లు, ఔషధాలను పంపేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థుల బృందం వీటిని తీసుకుని వెళుతోంది. మొత్తం 23 టన్నుల ఆహారం నేటి మధ్యాహ్నానికి కేరళ చేరుకుంటుంది. మరో రైలును కూడా పంపనున్నామని పేర్కొన్నారు. ఈ రైళ్లలో బియ్యం, రవ్వ, గోధుమ పిండి, నూనె, నీరు, ఉల్లిపాయలు, పప్పు, టీ పొడి, పాలు, పాలపొడి, చక్కెర, దుప్పట్లు తదితరాలు ఉన్నాయని తెలిపారు.

English summary
At a time when Kerala is in desperate need of help, a local fisherman's humble act has won several hearts on social media. Jaisal KP, a 32-year-old Tanur resident, hunched on a flooded road to help elderly women step into an NDRF inflatable boat, winning applauds across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X