ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్య, విజయన్కు రాజ్నాథ్ ఫోన్
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై కేంద్రహోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఫోన్ చేశారు.
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై కేంద్రహోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఫోన్ చేశారు. మరో వైపు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
34 ఏళ్ళ రాజేష్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు దాడి చేశారు. అయితే ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై బిజెపి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది.
అయితే రాజేష్ను సిపిఎం కార్యకర్తలే హత్య చేశారని బిజెపి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాతకక్షలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ముఖ్యమంత్రి విజయన్కు ఫోన్ చేశారు అయితే ఈ ఘటనకు పాల్పడినవారు ఎవరైనా చర్యలు తీసుకొంటామని హోంమంత్రికి విజయన్ సమాధానమిచ్చారు. ఈ మేరకు సిఎంఓ తెలిపింది.
మరో వైపు ఈ ఘటనకు కారకులుగా అనుమానిస్తున్న ఐదుగురు సిపిఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.