వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ వరదలు: మలయాళీ ఎన్నారై రూ. 50కోట్ల విరాళం, బజాజ్ రూ.2కోట్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేరళ కు భారీ సహాయాన్ని అందించిన వీపీఎస్ హెల్త్‌కేర్ సంస్థ ఛైర్మన్ డా. షంషీర్ వయలిల్

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు అనేకమంది తమ మంచి మనసుతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 700కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని అనేక మంది ప్రముఖులు, వ్యాపార సంస్థలు, ఎన్జీవోలు, చిన్నారులు కూడా మేముసైతం అంటూ కేరళకు సాయమందిస్తున్నారు.

మలయాళీ ఎన్నారై రూ.50కోట్ల విరాళం

మలయాళీ ఎన్నారై రూ.50కోట్ల విరాళం

తాజాగా, అబుదాబీలో స్థిరపడిన భారత సంతతి వ్యాపారవేత్త భారీ విరాళాన్ని ప్రకటించారు. అబుదాబీ కేంద్రంగా పనిచేసే వీపీఎస్ హెల్త్‌కేర్ సంస్థ ఛైర్మన్ డా. షంషీర్ వయలిల్ తన సొంత రాష్ట్రమైన కేరళకు 26మిలియన్ దుబాయ్ దిర్హమ్‌లను(దాదాపు రూ.50కోట్లు) విరాళం ఇచ్చారు.

 సీఎం సహాయనిధికి..

సీఎం సహాయనిధికి..

షంషీర్ వయలిల్‌కు మధ్యఆసియా, భారత్, యూరప్‌లలో మొత్తం 22 ఆస్పత్రులు, 125 మెడికల్ సెంటర్లు ఉన్నాయి. డాక్టర్ షంషీర్ వయలిల్, తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కలిసి ఈ మొత్తాన్ని సమకూర్చి కేరళ వరద బాధితుల కోసం విరాళం ఇచ్చినట్లు సమాచారం. రూ.50కోట్లను కేరళ సీఎం సహాయ నిధికి షంషీర్ పంపించారు. కేరళను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా షంషీర్ అన్నారు.

బజాజ్ విరాళం రూ.2కోట్లు

బజాజ్ విరాళం రూ.2కోట్లు

ఇది ఇలా ఉండగా, ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో కూడా కేరళకు తమవంతు సాయం చేసింది. కేరళకు రూ.2కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రూ. కోటిని కేరళ సీఎం సహాయ నిధికి ఇస్తుండగా, మరో రూ.కోటిని జానకిదేవి బజాజ్ వికాస్ సంస్థకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సంస్థ ద్వారా కేరళ ప్రజలకు అవసరమైన వస్తు, సామాగ్రిని అందించనున్నట్లు వెల్లడించింది. కాగా, ఇప్పటికే బజాజ్ ట్రస్ట్స్ నుంచి రూ.50లక్షలు కేరళకు విరాళంగా ఇచ్చారు. ఇక మరో ఆటోమొబైల్‌ సంస్థ హ్యుండాయ్‌ మోటార్స్‌ కూడా కేరళ రాష్ట్ర సీఎం సహాయ నిధికి రూ. కోటి ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ రూ. 2కోట్లు విరాళమిచ్చింది.

బాబా రాందేవ్ 50లక్షల విరాళం.. కోటిన్నర సేవలు

బాబా రాందేవ్ 50లక్షల విరాళం.. కోటిన్నర సేవలు

కేరళ వరద బాధితుల కోసం ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ రూ.50లక్షల విరాళాన్ని ప్రకటించారు. దీంతోపాటు రూ. కోటిన్నర విలువ చేసే వస్తువులను కేరళ, కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. సైన్యం చేపట్టిన సహాయక చర్యలను చూసి జాతి గర్విస్తుందన్నారు.

English summary
NRI billionaire and chairman of Abu Dhabi-headquartered VPS Healthcare Dr Shamsheer Vayalil will donate Rs 50 crore for the relief of flood victims in Kerala, which is the largest individual contribution, so far. Vayalil will set up a project, which will provide solutions for three issues the victims face – housing, healthcare and education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X