వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown చాన్స్: బ్యూటీషియన్ ఆంటీతో లవ్, అడిగినంత డబ్బు, భార్య బంధువు, తెగనరికి. పెట్రోల్ !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ కోల్లాం/పాలక్కాడ్: వయసులో పెద్దదైన భార్య బంధువుకు వల వేసిన సంగీతం మాస్టర్ ఆమెను గర్భవతిని చేశాడు. తనను పెళ్లి చేసుకుని సమాజంలో భార్య హోదా ఇస్తాడనే నమ్మంతో ప్రియుడు ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చింది. అయితే తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందని, రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే భయంతో ఆ సంగీతం మాస్టర్ కిరాతకుడిగా మారాడు. గర్భవతి అయిన ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి మోకాళ్ల వరకు కాళ్లు తెగనరికిపెట్రోల్ పోసి నిప్పంటించి ఇంటి ఆవరణంలోనే పూడ్చి పెట్టాడు. అయితే lockdown కాలం కలిసిరాకపోవడం, పారిపోవడానికి అవకాశం లేకపోవడంతో ప్రియురాలిని హత్య చేసిన నెల రోజుల తరువాత ప్రియుడు పోలీసులకు చిక్కిపోయాడు.

lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!

కేరళ బ్యూటీషియన్

కేరళ బ్యూటీషియన్

కేరళలోని కోల్లాం జిల్లాలోని కొట్టియాం ప్రాంతంలోని నాడువిలక్కరంలో నివాసం ఉంటున్న సుచిత్రా (43) అనే మహిళ బ్యూటీషియన్ గా పని చేస్తున్నది. మార్చి 17వ తేదీ సుచిత్రా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మార్చి 20వ తేదీ వరకు సుచిత్రా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఫోన్ చేసి మాట్లాడింది. తరువాత సుచిత్రా నుంచి ఎవ్వరికి ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు.

లాక్ డౌన్ తో అయోమయం

లాక్ డౌన్ తో అయోమయం

మార్చి 20వ తేదీ తరువాత సుచిత్రా నుంచి ఎవ్వరికి ఫోన్ కాల్స్ రాకపోవడం, ఆమె ఆచూకిలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అదే సమయంలో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో మరింత ఆందోళన చెందిన సుచిత్రా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రియుడు సంగీతం మాస్టర్

ప్రియుడు సంగీతం మాస్టర్

కేరళలోని కోజికోడ్ జిల్లా పాలక్కాడ్ లోని మూడు స్కూల్స్ లో ప్రశాంత్ (32) అనే వ్యక్తి సంగీతం మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య, 7 నెలల కుమారుడు ఉన్నాడు. ప్రశాంత్ భార్య బంధువు బ్యూటీషియన్ సుచిత్రా, కొడుకు నామకరణం రోజు ప్రశాంత్ ఇంటికి సుచిత్రా వెళ్లింది. ఆ సమయంలో ప్రశాంత్, సుచిత్రాకు పరిచయం అయ్యింది.

ప్రేమలో పడిన సుచిత్రా

ప్రేమలో పడిన సుచిత్రా

సుచిత్రాకు ఇంతకు ముందే వివాహం అయ్యింది. భర్తతో విడాకులు తీసుకున్న సుచిత్రా పాలక్కాడ్ లో బ్యూటీషిన్ గా పని చేస్తున్నది. భార్య దూరపు బంధువు కావడంతో సుచిత్రాతో పరిచయం పెంచుకున్న ప్రశాంత్ నిత్యం సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు. తరువాత ప్రశాంత్, సుచిత్రా ప్రేమలో పడ్డారు.

డబ్బులు తీసుకుని తల్లిని చేసి !

డబ్బులు తీసుకుని తల్లిని చేసి !

అవసరాల కోసం సుచిత్రా దగ్గర ప్రశాంత్ రూ. 3 లక్షలకు పైగా డబ్బులు తీసుకున్నాడు. ఒంటరిగా చిక్కిన సుచిత్రాతో సహజీవనం చేసిన ప్రశాంత్ ఆమెను గర్బవతిని చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో కలిసి ఎక్కడపడితే అక్కడ తిరిగాడు. అయితే సుచిత్రాను రెండో పెళ్లి చేసుకుంటే భార్యతో వ్యవహారం చెడిపోతుందని, సమాజానికి సమాధానం చెప్పలేమని ప్రశాంత్ భావించాడు.

పెళ్లి చేసుకుంటానని పిలిపించి !

పెళ్లి చేసుకుంటానని పిలిపించి !

ఇటీవల కాలంలో తనను పెళ్లి చేసుకోవాలని సుచిత్రా ప్రశాంత్ మీద ఒత్తిడి చేసింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రశాంత్ ను నిలదీసిన సుచిత్రా తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని, నన్ను మోసం చేసిన నిన్ను వదిలి పెట్టనని బెదిరించింది. ఎక్కడ తన పరువు తీస్తుందో అనే భయంతో సుచిత్రాను చంపేయాలని ప్రశాంత్ నిర్ణయించుకున్నాడు. పక్కాప్లాన్ ప్రకారం మార్చి 20వ తేదీన పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు సుచిత్రాను ప్రశాంత్ ఒంటరిగా ఉంటున్న చిత్తడి ప్రాంతంలోని ఇంటికి పిలిపించుకున్నాడు.

కాళ్లు తెగనరికి, పెట్రోల్ పోసి నిప్పంటించి !

కాళ్లు తెగనరికి, పెట్రోల్ పోసి నిప్పంటించి !

ప్రశాంత్ ఇంటికి వెళ్లిన సుచిత్రాల మద్యమాటామాటా పెరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ప్రశాంత్ రిచార్జ్ లైట్ వైర్ తీసుకుని సుచిత్రా గొంతు బిగించి చంపేశాడు. తరువాత ఆమె శరీరాన్ని ముక్కలు చెయ్యాలని రెండు కాళ్లు మోకాళ్ల వరకు నరికేశాడు. తరువాత సుచిత్రా మృతదేహాన్ని పెట్రోల్ పోసి బూడిద చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. శరీరం పూర్తిగా కాలిపోకపోవడంతో ప్రశాంత్ నివాసం ఉంటున్న చిత్తడి ప్రాంతంలోని ఇంటి కాంపౌండ్ లోపల గోతితీసి పాతిపెట్టేశాడు.

పట్టించిన ఆంటీ ఫోన్ కాల్స్

పట్టించిన ఆంటీ ఫోన్ కాల్స్

సుచిత్రా ఆచూకి చిక్కకపోవడంతో కోల్లం డిప్యూటీ కమిషనర్ జోషి చెరియన్, డీఎస్పీ గోపకుమార్ రంగంలోకి దిగారు. సుచిత్రాకు తెలిసిన వారి దగ్గర ఆరా తియ్యగా ఆమె కోల్లంలో బ్యూటీషియన్ క్లాస్ లు ఉన్నాయని చెప్పిందని, ఆమెకు ప్రశాంత్ అనే వ్యక్తితో దగ్గర సంబంధాలు ఉన్నాయని అన్నారు. సుచిత్రా, ప్రశాంత్ ల ఫోన్ కాల్స్ పరిశీలించారు. ప్రశాంత్ ను బెండ్ తియ్యడంతో సుచిత్రాను హత్య చేసినట్లు అతను అంగీకరించాడు ప్రశాంత్ ఇంటి ఆవరణంలో శరీరం ముక్కలైన సుచిత్రా మృతదేహాన్ని బయటకు తీసి కోల్లాం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని, గర్బవతిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే భయంతోనే సుచిత్రాను తాను హత్య చేశానని ప్రశాంత్ నేరం అంగీకరించాడని కోల్లం డిప్యూటీ కమిషనర్ జోషి చెరియన్ మీడియాకు చెప్పారు.

English summary
Lockdown Murder: A 42-year-old woman, who went missing from Kottiyam in Kollam on March 17, was found murdered and buried in the compound of a rented house at Manali in Palakkad in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X