బంపర్ ఆఫర్: కేరళ ఆటో డ్రైవర్ కు స్కార్పియో గిఫ్ట్, ఎందుకంటే?
కేరళకు చెందిన ఓ ఆటోడ్రైవర్ మహీంద్రా స్కార్పియో ఎస్ యూ వీ మోడల్ ను అనుకరించి ఓ బంపర్ ఆఫర్ ను కొట్టేశాడు.
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఓ ఆటోడ్రైవర్ మహీంద్రా స్కార్పియో ఎస్ యూ వీ మోడల్ ను అనుకరించి ఓ బంపర్ ఆఫర్ ను కొట్టేశాడు. స్కార్పియో వాహానాన్ని త్రీ వీలర్ ఆటోగా తయారుచేసి ఏకంగా మహీంద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్ర మనసుదోచాడు. అంతేకాదు ఆయన నుండి మహీంద్ర ఫోర్డ్ కారును బహుమతిగా అందుకొన్నాడు.
కేరళకు చెందిన ఆటో డ్రైవర్ సునీల్ మహీంద్ర కంపెనీ నుండి మహీంద్ర సుప్రో మినీ ట్రక్ ను అందుకొన్నారు.ఈ ఏడాది మార్చి 19న, అనిల్ ఫణిక్కర్ మహీంద్రా స్కార్పియో మోడల్ లో ఉన్న ఓ ఆటో ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భారతీయ రోడ్లపై స్కార్పియో ఎంత పాపులరో తెలుపుతూ ఆనంద్ మహీంద్రకు ట్యాగ్ చేశాడు. దీనికి ఆనంద్ మహీంద్ర స్పందించారు.
ఆ ఆటో రిక్షా యజమాని ఎక్కడి వ్యక్తి కనుక్కోవాలని ఆయన ట్వీట్ చేశాడు.మహీంద్ర మ్యూజియం కోసం ఆ ఆటో రిక్షాను తాను తీసుకోవాలనుకొంటున్నట్టు ఆయన చెప్పారు.అంతేకాదు దాని స్థానంలో బహుమతిగా అతనికి ఓ బ్రాండ్ న్యూ వాహానాన్ని ఇస్తానని ఆయన ప్రకటించాడు.
మహీంద్ర టీం కేరళకు చెందిన సునీల్ ను గుర్తించింది. ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా బుదవారంనాడు వెల్లడించారు.అతనికి కొత్త వాహానం అందించినట్టు కూడ ఆయన చెప్పారు.