షాక్: 9 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 36 ఏళ్ల మహిళ, సంవత్సరం నుంచి ఇదే పని, కేసు నమోదు !
తిరువనంతపురం: 9 సంవత్సరాల బాలుడి మీద అత్యాచారం చేశారని మహిళ (36) మీద కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని వైద్యపరీక్షలకు తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కేరళ పోలీసులు అంటున్నారు.
బాలుడిపై అత్యాచారం చేసిన కేసులో వైద్యులు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు నివేదిక ఇచ్చారు. కేసు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు కేరళ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.
గత సంవత్సరం నుంచి మహిళ 9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధింపులకు గురి చెయ్యడంతో బాలుడు మానసికంగా అస్వస్థతకు గురైనాడని పోలీసులు అంటున్నారు. బాలుడు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే అత్యాచారం చేసిన మహిళ నివాసం ఉంటున్నదని కేరళ పోలీసులు అంటున్నారు. బాలుడి కుటుంబ సభ్యులకు, అత్యాచారం చేసిన మహిళ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి విషయంలో వివాదం ఉందని, ఆ కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.
బాలుడి నుంచి తాము వివరాలు సేకరించామని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ గురించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు అన్నారు. ఇటీవల ఎర్నాకుళంలో బాలుడి మీద అత్యాచారం చేసిన కేసులో మహిళను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.