వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రైవర్‌తో చెప్పులు తొడిగించుకున్న అసెంబ్లీ స్పీకర్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్‌ శక్తన్‌ వివాదంలో చిక్కుకున్నారు. తన కారు డ్రైవర్‌తో ఆయన చెప్పులు తొడిగించుకోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం అసెంబ్లీ ఆవరణలో వరిపంట సాగుపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి స్పీకర్‌ శక్తన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన తన డ్రైవర్‌తో కాళ్లకు చెప్పులు తొడిగించుకున్నారు. స్పీకర్‌ ధరించిన శాండిల్స్‌కి డ్రైవర్‌ పట్టీలు బిగిస్తున్న దృశ్యం మీడియా కంట చిక్కింది.

 Kerala Speaker asks staff to put shoes on for him

దీంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పించడం మొదలెట్టాయి. కాగా, ఈ విషయమై శక్తన్ గురువారం వివరణ ఇచ్చారు. తాను గత 18 ఏళ్లుగా కళ్లకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నానని, వైద్యులు తనను ముందుకు వంగకుండా ఉండాలని సూచించారని, అందువల్లే తన బంధువు తనకు చెప్పులు తీయడంలో సహాయం చేశాడని ఆయన తెలిపారు.

ఓ ప్రైవేటు కార్య్రక్రమానికి హాజరైనప్పుడు తీసిన ఆ ఫోటోపై చర్చ జరుగుతుండడం తనను కలచి వేసిందని శక్తన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూపించడం తగదన్నారు. 33 ఏళ్లుగా తాను శాసన సభ్యునిగా కొనసాగుతున్నాననీ, తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోకుండా ఈ విషయాన్ని ప్రముఖంగా చూపించడం సరికాదని తెలిపారు.

కాగా, ఇటీవల మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే కూడా సిబ్బందితో చెప్పులు మోయించి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

English summary
Kerala Assembly Speaker N Sakthan widened the ambit of his staff's duties by asking one of them to put his shoes on for him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X