విద్యార్థుల బ్యాగ్లో మద్యం బాటిల్స్ దాచిన టీచర్లు, విచారణ
తిరువనంతపురం: ఓ విద్యార్థి బ్యాగులో మద్యం బాటిళ్లను ఉంచినందుకు కేరళ టీచర్లు విచారణను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన కోజికోడ్లో జరిగింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎక్స్కర్షన్ కోసం కన్నూర్ విస్మయ పార్క్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు ఉపాధ్యాయులు మద్యం బాటిల్స్ కొని వాటిని విద్యార్థుల బ్యాగులో దాచారు.
52 మంది ఏడో తరగతి విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ఎక్స్కర్షన్కు వెళ్లారు. రొటీన్గా చెకింగ్లో భాగంగా వారు ఉన్న బస్సులో చెక్ చేస్తున్నప్పుడు విద్యార్థుల బ్యాగులో మద్యం బాటిల్స్ గుర్తించారు.
ఆ మద్యం బాటిల్స్ నిండుగా లేవు. వారిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే, తల్లిదండ్రులు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేయడంతో ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ మాత్రం అంతర్గతంగా దర్యాఫ్తు చేస్తోంది.
ఎక్సైజ్ డిపార్టుమెంట్ వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు కాబట్టి తాము ఏం చేయలేమని, అయితే పేరెంట్స్ కొందరు ఫిర్యాదు చేసినందున, దాని ఆధారంగా దర్యాఫ్తు జరుపుతున్నామని స్థానిక విద్యాశాఖ అధికారులు చెప్పారు.