వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడిన మంత్రి రాజీనామా చేసి ఇలా...

మహిళతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడిన కేరళ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి ఎకె ససీంద్రన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తనపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేసి దర్యాప్తు చేయించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మహిళతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడిన కేరళ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి ఎకె ససీంద్రన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తనపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేసి దర్యాప్తు చేయించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.

కేరళలో సిపిఎం నేతృత్వంలోని ఎల్ డి ఎఫ్ లో ఎన్సీపికి భాగస్వామిగా ఉంది.అయితే ఎన్సీపి నుండి ఎకె ససీంద్రన్ విజయన్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలను చేపట్టారు.

kerala transport minister quits from cabinet

అయితే ససీంద్రన్ ఓ మహిళతో అశ్లీలంగా మాట్లాడినట్టు ఆదివారం నాడు ఓ మీడియా చానల్ బయటపెట్టింది. దీనిపై కాంగ్రెస్, బిజెపిలు తీవ్రంగా మండిపడ్డాయి. ససీంద్రన్ ను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశాయి.

కేరళ సిఎం పినరయి విజయన్ ఈ విషయమై సీరియస్ గా తీసుకొన్నారు. రవాణ శాఖ మంత్రి ససీంద్రన్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన ఆదేశించారు.దీంతో ససీంద్రన్ ఆదివారంనాడు మంత్రి పదవికి రాజీనామా చేశారు.తనపై వచ్చిన ఆరోపణలపై కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు.

English summary
kerala transport minister ak Saseendran (ncp) resigned on Sunday after allegations of misconduct with a woman surfaced against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X