వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులపై టియర్ గ్యాస్ -సీఎంకు చుక్కలు చూపించారు -మహాపంచాయిత్ వేదిక ధ్వంసం

|
Google Oneindia TeluguNews

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసలు చేస్తోన్న రైతుల్లో చీలిక తెచ్చేందుకు బీజేపీ సర్కారు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 'కిసాన్ మహా పంచాయత్' పేరుతో ఆదివారం తలపెట్టిన సభకు నిరసన సెగ తగిలింది. రైతుల ఆందోళనతో వెనక్కి తగ్గిన ఆయన తన సభను రద్దు చేసుకున్నారు.

నిమ్మగడ్డకు టీడీపీ నేతల సన్మానం -ఎస్ఈసీ ఆలయాల సందర్శనలో సంచలనం -చంద్రబాబు విశ్వాసం కోసం..నిమ్మగడ్డకు టీడీపీ నేతల సన్మానం -ఎస్ఈసీ ఆలయాల సందర్శనలో సంచలనం -చంద్రబాబు విశ్వాసం కోసం..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఒనగూరే ప్రయోజనాలను రైతులకు వివరించేందుకుగానూ కెమ్లా గ్రామంలో సీఎం సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉండగా.. రైతులు పెద్ద సంఖ్యలో గుమ్మికూడి నిరసనలు తెలిపారు. సీఎం రాక సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగి.. చివరిది బలప్రయోగానికి దారితీసింది..

 Khattar’s kisan mahapanchayat cancelled after protesting farmers vandalise venue

రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని రైతులు గ్రామంలోని వేదిక వద్దకు చేరుకుని ఆందోళన కొనసాగించారు. వేదికపైకెక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ కోసం ఏర్పాటు చేసిన కుర్చీలను విసిరిపారేశారు. సభా వేదిక వద్ద ఆందోళన జరుగుతుండడంతో ముఖ్యమంత్రి ఖట్టర్ 'కిసాన్ మహా పంచాయత్'ను రద్దు చేసుకున్నారు.

షాకింగ్: చికెన్ బిర్యానీతో బర్డ్ ఫ్లూ -రైతుల ద్వారా వైరస్ వ్యాప్తి -రంగంలోకి కేంద్రం: బీజేపీ ఎమ్మెల్యేషాకింగ్: చికెన్ బిర్యానీతో బర్డ్ ఫ్లూ -రైతుల ద్వారా వైరస్ వ్యాప్తి -రంగంలోకి కేంద్రం: బీజేపీ ఎమ్మెల్యే

 Khattar’s kisan mahapanchayat cancelled after protesting farmers vandalise venue

హర్యానా సీఎం ఖట్టర్ రాజకీయ ప్రేరితంగా నిర్వహించతలపెట్టిన 'కిసాన్ మహా పంచాయత్‌'పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. తిండిపెడుతున్న రైతుల సెంటిమెంట్లతో ఆటలు ఆడుకోవద్దని, లా అండ్ ఆర్డర్‌లో జోక్యం చేసుకోవద్దని, రైతులతో మీరేమైనా మాట్లాడాలనుకుంటే.. 46 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడాలని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు.

English summary
Haryana Police on Sunday used tear gas and water cannons to disperse the protesting farmers who had gathered in Kaimla village of Haryana's Karnal district where Chief Minister Manohar Lal Khattar was scheduled to hold a 'Kisan Mahapanchayat' to highlight the “benefits” of the Centre's three agriculture laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X