Khiladi: రిజిస్టర్ మ్యారేజ్ మొగుడు, లాడ్జ్ లో ఎంజాయ్ చేసి బ్లాక్ మెయిల్, బ్యూటీపార్లల్ ఆంటీ ఎంట్రీతో !
చెన్నై/హైదరాబాద్: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వ్యాపారవేత్తను కిలాడీ లేడీ పక్కాప్లాన్ ప్రకారం లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లింది. లాడ్జ్ లో ఆ వ్యాపారవేత్తతో ఎంజాయ్ చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా రాసలీలల వీడియోలు తీసి అతన్ని బ్లాక్ మెయిల్ చేసింది. వ్యాపారవేత్త, రిజిస్టర్ మ్యారేజ్ పెళ్లాం పంచాయితీలో బ్యూటీపార్లల్ ఆంటీ, మరో కిలాడీ ఇన్స్ పెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో కథ అనేక మలుపులు తిరిగింది. చివరికి అటూ ఇటూ తిరిగిన కథ వ్యాపారవేత్త దెబ్బతో క్లైమాక్స్ కు చేరుకుంది.
friends: మీ అమ్మ సూపర్ ఫిగర్ రా, కత్తిలా ఉంటుంది, భలే ఎంజాయ్ చేశా, క్వాటర్ బాటిల్ తో రెండు !
వ్యాపారవేత్త
తమిళనాడులో కోయంబత్తూరు సిటీ ఎంతటి పారిశ్రామిక కేంద్రం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోయంబత్తూరుకు చెందిన రాజసింహన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నాడు. వ్యాపారం పనులపై ఇతను ఎక్కువగా హైదరాబాద్ వెళ్లి వస్తున్నాడు.
రిజిస్టర్ మ్యారేజ్ మొగుడు పెళ్లాం
2018లో హైదరాబాద్ కు చెందిన ఉమారాణి అనే మహిళ మ్యాట్రిమోనియల్ ద్వారా వ్యాపారవేత్త రాజసింహన్ కు పరిచయం అయ్యింది. తరువాత రాజసింహన్, ఉమారాణి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రాజసింహన్ వ్యాపారం పనులపై వేరేవేరే ప్రాంతాలు తిరుగుతున్నా ఉమారాణి మీద ప్రత్యేక నిఘా వేశాడు. ఉమారాణి మీద రాజసింహకు అనుమానాలు ఉన్నాయి.
ఉమారాణి రాసలీలల స్కెచ్
ఉమారాణికి ఇంతకు ముందే వివాహం అయ్యింది. ఆ విషయం దాచిపెట్టి రాజసింహన్ ను వలలో వేసుకుని అతన్ని మళ్లీ సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇటీవల హైదరాబాద్ లోని ఓ లాడ్జ్ లో గది బుక్ చేసిన ఉమారాణి వ్యాపారవేత్త రాజసింహన్ ను అదే లాడ్జ్ కు పిలిపించుకుంది. తరువాత రిజిస్టర్ మ్యారేజ్ మొగుడు రాజసింహన్ తో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఉమారాణి ఆ రాసలీలల వీడియోలును తీసింది.
సీక్రెట్ మొగుడికే బ్లాక్ మెయిల్
తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నీ రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఉమారాణి రాజసింహన్ ను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టింది. రాజసింహన్ దగ్గర భారీ మొత్తంలో ఉమారాణి డబ్బులు వసూలు చేసింది. చివరికి తన నగ్న వీడియోలు తీసిన రాజసింహన్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఉమారాణి చెన్నైలోని థౌజండ్ లైట్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
బ్యూటీ పార్లల్ ఆంటీ ప్లాన్
రాజసింహన్ మీద కేసు పెట్టడానికి ఉమారాణికి విష్ణుప్రియ అనే మహిళ సహకరించింది. విష్ణుప్రియ బ్యూటీపార్లల్ నిర్వహిస్తోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన రాజసింహన్ జరిగిన విషయం మొత్తం పోలీసు అధికారులకు చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు రిజిస్టర్ మ్యారేజ్ చీటింగ్ పెళ్లాం ఉమారాణితో పాటు విష్ణప్రియ, ఇన్స్ పెక్టర్ జ్ఞానసెల్వం మీద కేసు నమోదు చేశారు.
ఉమారాణి భలే కిలాడి
మొదట ఉమారాణి పోలీసులకు చిక్కింది. లాడ్జ్ భాగోతం స్కెచ్ లు ఇంతకు ముందు ఉమారాణి చాలా వేసిందని, ఆమెకు ఇలాంటి పాడుపనులు కొత్త ఏమీ కాదని పోలీసు అధికారులు అంటున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా వ్యాపారవేత్త రాజసింహన్ ను అరెస్టు చేసిన పోలీసు ఇన్స్ పెక్టర్ జ్ఞానసెల్వంకు సినిమా కష్టాలు ఎదురైనాయి.