బిజెపిలో చేరికంటూ వార్తలు: మీడియాపై ఖుష్బూ పైర్
చెన్నై: తమిళం మీడియాపై ప్రముఖ నటి, రాజకీయ నేత ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంకెకు రాజీనామా చేసిన ఖుష్బూ బిజెపిలో చేరుతారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. బిజెపిలో చేరేందుకే తాను డిఎంకెను వీడినట్లు చేస్తున్న వ్యాఖ్యలు సరి కావని ఆమె అన్నారు.
ఆ మేరకు తన అభిప్రాయాలను ట్విట్టర్లో రాశారు. తాను ఎప్పుడూ ఏ పార్టీలో చేరడానికి ప్రయత్నించలేదని, ఇంతకు ముందు ముందు గానీ ప్రస్తుతం గానీ అలాంటి ప్రయత్నం చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.
తెల్లకాగితాన్ని నింపేందుకు కష్టపడుతున్నట్లు పత్రికలు ఇలాంటి రాతల్ని ఆపితే సంతోషిస్తానని ఆమె ట్వీట్ చేశారు. డిఎంకెను వీడిన ఖుష్బూ బిజెపిలో చేరుతారంటూ తమిళ మీడియాలో పెద్ద యెత్తున వార్తలు వచ్చాయి.
ఖుష్బూ డిఎంకెకు సోమవారం రాజీనామా చేశారు. ఎంత కష్టపడినా గుర్తింపు దక్కడం లేదని ఆమె తన రాజీనామా లేఖలో అన్నారు. ఎంతో గుండె బరువుతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.