లవ్ ఎంతుందో: లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఎంత పని చేశాడు, ఇదెక్కడి రామాయణం!
రాజ్ కోట్: లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న తన ప్రియురాలు తనను ఎంత ప్రేమిస్తుందో తెలుసుకోవడానికి ఓ యవకుడు కిడ్నాప్ నాటకం ఆడాడు. అయితే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న యువతి ప్రియుడి కోసం పెద్దగా త్యాగం చెయ్యలేకపోయింది. ఇదెక్కడి రామాయణం అంటూ ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే ప్రియుడి నాటకం బయటకు పడటం, పోలీసులకు తిక్కరేగడంతో అతను కటకటాలపాలైనాడు.
రాసలీలల దెబ్బతో భర్తను రూ. 5 లక్షలకు అమ్మేసిన భార్య, కొనుక్కున్న ప్రియురాలు!
చాలబాగుంది
గుజరాత్ లో మెహుల్ జోషి (26), ఇషా పంచెల్ (18) నివాసం ఉంటున్నారు. మెహుల్ జోషి, ఇషా ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఇప్పుడే మెహుల్ జోషి, ఇషా పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకోలేదు. ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకున్న తరువాత పెళ్లి విషయం ఆలోచిద్దామని ఇద్దరూ నిర్ణయించారు.
లివ్ ఇన్ రిలేషన్ షిప్
మెహుల్ జోషి, ఇషా లివ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగించాలని, అన్నీ సవ్యంగా ఉంటే తరువాత పెళ్లి గురించి ఆలోచించాలని నిర్ణయించారు. అంతే గుజరాత్ లోని రాజ్ కోట్ లో విలాసవంతమైన ఓ ఫ్లాట్ తీసుకుని పెళ్లి కాకుండానే కాపురం చేస్తున్నారు.
ప్రియుడికి అనుమానం
తన ప్రియురాలు ఇషా జీవితాంతం తనతో ఉంటుందో ? ఉండదో ? అనే అనుమానం మెహుల్ జోషికి వచ్చింది. ప్రియురాలు ఇషా తన మీద ఎంత ప్రేమ పెట్టుకుందో తెలుసుకోవాలని మెహుల్ జోషి ప్రయత్నాలు చేశాడు. అయితే మెహుల్ జోషి అనుకున్న రిజల్ట్ మాత్రం రాలేదు.
కిడ్నాప్ డ్రామా
తన మీద ఇషాకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి మెహుల్ జోషి కిడ్నాప్ డ్రామా ఆడాలని అనుకున్నాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, నువ్వే నన్ను రక్షించాలని ఇషాక్ కు ఫోన్ చేసి చెప్పాడు. గొంతు మార్చి మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి ఇషాకు ఫోన్ చేసి రూ. 3 లక్షలు ఇవ్వకుంటే మెహుల్ జోషిని పంచేస్తానని అతనే బెదిరించాడు.
ఇదెక్కడి రామాయణం
రూ. 3 లక్షలు ఇచ్చి మెహుల్ జోషిని విడిపించడానికి ఇషా వెనకడుగు వేసింది. ఆందోళన చెందిన ఇషా ఇదెక్కడి రామాయణం, లివింగ్ రిలేషన్ షిప్ అనుకుంటే మొదటికే మోసం వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మొబైల్ ట్రేస్ చేశారు. గాంధిధామాలో బెదిరింపు ఫోన్ వచ్చిన మొబైల్ నెట్ వర్క్ ట్రేస్ అయ్యింది.
గెస్ట్ హౌస్ లో మకాం
ఒక గెస్ట్ హౌస్ లో తాపీగా ఉంటున్న మెహుల్ జోషిని పోలీసులు గుర్తించారు. ఆ గెస్ట్ హౌస్ లో మెహుల్ జోషి తప్పా ఎవ్వరూ లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తన ప్రియురాలు ఇషాకు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి కిడ్నాప్ డ్రామా ఆడానని మెహుల్ జోషి పోలీసులకు చెప్పాడు. పోలీసులకు తిక్కరేగి మెహుల్ జోషిని అరెస్టు చేసి అతని మీద కేసు నమోదు చేశారు.