కుక్కను చంపి తెస్తే.. డబ్బులు... మున్సిపల్ అధికారుల దారుణం
వీధుల్లో కుక్కల బాధలు అన్ని ఇన్ని కావు, ఏ ప్రాంతంలో చూసినా కుక్కలు స్థైర్య విహారం చేయడం సర్వసాధరణంగా మారింది..దీంతో వీటిని అదుపు చేసేందుకు అధికారులు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు.. కుక్కలు బెడద నుండి ప్రజలను కాపాడేందుకు అధికారులు అప్పుడప్పుడు చేతులెత్తేస్తారు కూడ..... ఇందులో భాగంగానే మధ్యప్రదేశలోని మున్సిపల్ అధికారులు కుక్కలను నిరోధించడం ప్రజల చేతిలోనే పెట్టారు....ఈనేపథ్యంలోనే కుక్కను ప్రాణంతో తెచ్చినా... చంపి తెచ్చిన నజరానలు ప్రకటించారు.
మధ్యప్రదేవ్లోని ష్యోపుర్ జిల్లాలో గల విజయపూర్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది..దీంతో అక్కడి మున్సిపల్ అధికారులు కుక్క సమాచారం ఇవ్వడంతో పాటు,బతికున్న కుక్కను అప్పగించినా, లేదా దాన్ని చంపి తెచ్చిన వారికి రూ.1100 నజరాన ప్రకటించారు. దీంతో ప్రజలు కుక్కలను వేటాడే పనిలో ఎగబడ్డారు. వీధి కుక్కలను దారుణంగా చంపి అధికారులకు అందిస్తున్నారు. కుక్కలు ఎక్కడ ఉన్న మరి వెతికి వాటి వేటాడి దారుణంగా కొట్టి చంపుతున్నారు...
అయితే ఇందుకు కారణం ఇటివల ఆ గ్రామంలోని 30 మంది వ్యక్తులపై కుక్కలు దాడులు చేసి గాయపరిచాయి..దీంతో మున్సిపల్ అధికారులు తగిన చర్యలు చేపట్టకుండా ప్రజల చేతే వాటిని చంపి వేసే విధంగా ప్లాన్ వేశారు. ఇలా ప్రభుత్వ అధికారులే కుక్కలను చంపేందుకు ప్రకటన ఇవ్వడంతో ప్రజలు రెచ్చిపోయి కుక్కలను చంపివేయడం వివాదంగా మారింది.